<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.churakalu.com/administrator/author-1" rel="self" type="application/rss+xml" />
                <generator>Churakalu RSS Feed Generator</generator>
                <title>Mohammad Imran - Churakalu</title>
                <link>https://www.churakalu.com/author/1/rss</link>
                <description>Mohammad Imran RSS Feed</description>
                
                            <item>
                <title>సిద్దిపేట ఆర్డీఓ ముందే బాధితులు పై హత్య యత్నం </title>
                                    <description><![CDATA[<p>ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం!</p>
<p>• విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు</p>
<p>• ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ </p>
<p>• వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి</p>
<p>• సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు</p>
<p>సిద్దిపేట, మే 16:<br />న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం రాజ్యమేలింది. భూవివాదంపై విచారణ జరుపుతున్న అధికారి ముందే ప్రత్యర్థులు రెచ్చిపోయారు. ఆర్డీఓ హాల్‌లోనే వృద్ధుడని కూడా చూడకుండా తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన హేయమైన ఘటన సిద్దిపేట ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో శనివారం కలకలం రేపింది. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కళ్లెదుటే ఈ దారుణం జరుగుతున్నా, ఆయన దాడిని వారించకుండా మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.</p>
<p>వివరాల్లోకి వెళ్తే...<br />సిద్దిపేట పట్టణ శివారులోని సర్వే నెంబర్ 1440 లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం!</p>
<p>• విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు</p>
<p>• ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ </p>
<p>• వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి</p>
<p>• సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు</p>
<p>సిద్దిపేట, మే 16:<br />న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం రాజ్యమేలింది. భూవివాదంపై విచారణ జరుపుతున్న అధికారి ముందే ప్రత్యర్థులు రెచ్చిపోయారు. ఆర్డీఓ హాల్‌లోనే వృద్ధుడని కూడా చూడకుండా తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన హేయమైన ఘటన సిద్దిపేట ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో శనివారం కలకలం రేపింది. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కళ్లెదుటే ఈ దారుణం జరుగుతున్నా, ఆయన దాడిని వారించకుండా మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.</p>
<p>వివరాల్లోకి వెళ్తే...<br />సిద్దిపేట పట్టణ శివారులోని సర్వే నెంబర్ 1440 లో గల 1-04 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి పంపకాల్లో భాగంగా సిద్దిపేట నివాసి అయిన నాయకం మల్లయ్యకు దక్కింది. 1993 నుంచి అన్ని రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ భూమి మల్లయ్య పేరిటే నమోదై ఉంది. </p>
<p>అయితే, ఇటీవల మల్లయ్య సోదరుడైన లక్ష్మణ్ తప్పుడు ఆరోపణలతో ఈ భూమిపై ఆర్డీఓ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆర్డీఓ కార్యాలయం నుంచి నోటీసులు రావడంతో, శనివారం మల్లయ్య తన కుమారుడైన నాయకం ప్రసాద్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు.</p>
<p>కోర్టు హాల్‌లోనే గొంతు నులిమి...<br />ఆర్డీఓ సమక్షంలో ప్రసాద్ తన వాదనలు వినిపిస్తుండగా, అక్కడే ఉన్న వారి బాబాయ్‌లు శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలు ఒక్కసారిగా తండ్రీకొడుకులపై పడి విచక్షణారహితంగా దాడికి దిగారు. "వీడిని చంపితేనే మనకు ఈ భూమి దక్కుతుంది, ప్రాణాలతో ఉంచొద్దు" అని కేకలు వేస్తూ ప్రసాద్ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగక కార్యాలయం ఆవరణలోకి లాక్కొచ్చి మరీ దాడి చేశారు. ఒకరు ప్రసాద్ పురుషాంగాలపై బలంగా కొట్టగా, మరొకరు గొంతు గట్టిగా నొక్కారు. వృద్ధుడైన తండ్రి మల్లయ్యపై కూడా నిందితులు దాడికి తెగబడ్డారు.</p>
<p>అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు?<br />శాంతిభద్రతలను కాపాడాల్సిన, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న ఆర్డీఓ కళ్ల ముందే ఈ ఘోరం జరుగుతున్నా ఆయన మౌనం వహించడంపై బాధితులు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన చాంబర్‌లోనే ఓ వృద్ధుడిపై, అతని కొడుకుపై హత్యాప్రయత్నం జరుగుతుంటే ఆర్డీఓ ఎందుకు అడ్డుకోలేదు? కనీసం సిబ్బందిని పిలిచి దాడిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>న్యాయం కోసం పోలీసుల ఆశ్రయం:</p>
<p>భూవివాదం సాకుతో తనపై, తన వృద్ధ తండ్రిపై ఆర్డీఓ ముందే హత్యాప్రయత్నానికి ఒడిగట్టి, ప్రాణాపాయ ముప్పు తలపెట్టిన శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితుడు నాయకం ప్రసాద్ సిద్దిపేట వన్ టౌన్ సిఐ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/attempted-murder-on-victims-in-front-of-siddipet-rdo/article-1080</link>
                <guid>https://www.churakalu.com/regional/attempted-murder-on-victims-in-front-of-siddipet-rdo/article-1080</guid>
                <pubDate>Sat, 16 May 2026 17:40:17 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం </title>
                                    <description><![CDATA[<p>వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం</p>
<p>  =యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి</p>
<p>చురకలు విలేఖరి ​వీణవంక  మే 15:<br />కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు స్థానిక ఎస్ఐ ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన ముఖ్య అతిథులుగా హాజరై, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పట్ల ఉండాల్సిన ఆసక్తినీ కనబరచాలీ.యువత ఖాళీ సమయాల్లో చెడు దారులకు మళ్ళకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతాయి. గ్రామంలో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 8వ వార్డు సభ్యుడు భోగం అనిల్‌ను ఆర్గనైజర్లను ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/start-of-cricket-tournament/article-1079"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260516-wa0001.jpg" alt=""></a><br /><p>వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం</p>
<p> =యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి</p>
<p>చురకలు విలేఖరి ​వీణవంక  మే 15:<br />కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు స్థానిక ఎస్ఐ ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన ముఖ్య అతిథులుగా హాజరై, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పట్ల ఉండాల్సిన ఆసక్తినీ కనబరచాలీ.యువత ఖాళీ సమయాల్లో చెడు దారులకు మళ్ళకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతాయి. గ్రామంలో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 8వ వార్డు సభ్యుడు భోగం అనిల్‌ను ఆర్గనైజర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.<br />​సర్పంచ్ సరోజన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ <br />​తాళ్లపల్లి మహేష్,మాజీ ఉపసర్పంచ్ ​వోరెం  భానుచందర్,​వార్డు సభ్యులు నీల శ్రీకాంత్, కుమార్,<br />పంచాయతీ కార్యదర్శి యశోద,​స్థానిక క్రీడాకారులు గ్రామ యువత పాల్గొన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260516-wa0000.jpg" alt="IMG-20260516-WA0000" width="1185" height="506"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/start-of-cricket-tournament/article-1079</link>
                <guid>https://www.churakalu.com/regional/start-of-cricket-tournament/article-1079</guid>
                <pubDate>Sat, 16 May 2026 07:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260516-wa0001.jpg"                         length="150278"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం </title>
                                    <description><![CDATA[<p>మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం..</p>
<p>కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం..</p>
<p>ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం..</p>
<p>కరీంనగర్: </p>
<p>రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.</p>
<p>ప్రమాదం అనంతరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/a-missed-opportunity-for-minister-adluri/article-1078"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260513-wa0012.jpg" alt=""></a><br /><p>మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం..</p>
<p>కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం..</p>
<p>ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం..</p>
<p>కరీంనగర్: </p>
<p>రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.</p>
<p>ప్రమాదం అనంతరం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రికి మెడికల్ కు సంబంధం లేని వ్యక్తులు నిర్వహిస్తూ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు.  కనీస వైద్య సదుపాయాలు లేకున్నా అర్హత లేని వైద్యులతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం ఎలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా మంత్రి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260513-wa0011.jpg" alt="IMG-20260513-WA0011" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/a-missed-opportunity-for-minister-adluri/article-1078</link>
                <guid>https://www.churakalu.com/regional/a-missed-opportunity-for-minister-adluri/article-1078</guid>
                <pubDate>Wed, 13 May 2026 23:23:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260513-wa0012.jpg"                         length="65616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రియాద్ లో ఉచిత హృదయ వైద్య శిబిరం </title>
                                    <description><![CDATA[<p>రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం: మానవతా సేవకు రియాద్ ఇండియన్ అసోసియేషన్ నూతన దిశ</p>
<p>రియాద్: ప్రశంసనీయమైన మానవతా కార్యక్రమంగా, రియాద్ ఇండియన్ అసోసియేషన్ మెడికల్ వరల్డ్ క్లినిక్ సహకారంతో మే 8న రియాద్‌లోని అల్ తావూన్ ప్రాంతంలో ఉచిత హృదయ సంబంధ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం, ప్రజల్లో ముందస్తు ఆరోగ్య అవగాహన పెంపొందించడం మరియు అందరికీ అందుబాటులో ఉండే హృదయ వైద్య సలహాలను అందించడం లక్ష్యంగా సాగింది.<br />వివిధ సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన మహిళలు మరియు పిల్లలతో సహా 280 మందికి పైగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బిజు జోసెఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇసక్కి మరియు డాక్టర్ సంతోష్ గుండె ఆరోగ్య పరిరక్షణ మరియు ప్రజారోగ్య అవగాహన యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ పొన్మురుగన్ స్వాగత ప్రసంగం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/nri/free-cardiology-camp-in-riyadh/article-1077"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260513-wa0001.jpg" alt=""></a><br /><p>రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం: మానవతా సేవకు రియాద్ ఇండియన్ అసోసియేషన్ నూతన దిశ</p>
<p>రియాద్: ప్రశంసనీయమైన మానవతా కార్యక్రమంగా, రియాద్ ఇండియన్ అసోసియేషన్ మెడికల్ వరల్డ్ క్లినిక్ సహకారంతో మే 8న రియాద్‌లోని అల్ తావూన్ ప్రాంతంలో ఉచిత హృదయ సంబంధ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం, ప్రజల్లో ముందస్తు ఆరోగ్య అవగాహన పెంపొందించడం మరియు అందరికీ అందుబాటులో ఉండే హృదయ వైద్య సలహాలను అందించడం లక్ష్యంగా సాగింది.<br />వివిధ సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన మహిళలు మరియు పిల్లలతో సహా 280 మందికి పైగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బిజు జోసెఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇసక్కి మరియు డాక్టర్ సంతోష్ గుండె ఆరోగ్య పరిరక్షణ మరియు ప్రజారోగ్య అవగాహన యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ పొన్మురుగన్ స్వాగత ప్రసంగం చేశారు.<br />ఈ కార్యక్రమంలో పదాధికారులు, సలహా మండలి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు మెడికల్ వరల్డ్ క్లినిక్ ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు. వారి నిరంతర మరియు నిస్వార్థ సేవా భావం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, మరెందరో సమాజ సేవలో పాల్గొనేలా ప్రేరేపించింది.<br />వైద్యులు, నర్సులు, సమన్వయకర్తలు మరియు వాలంటీర్ల అంకితభావ సేవలు శిబిరానికి మానవత్వం మరియు ఆప్యాయతను తీసుకువచ్చి, లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కార్యక్రమం డాక్టర్ సంతోష్ కృతజ్ఞతా ప్రసంగంతో ముగిసింది.<br />ఈ వైద్య శిబిరం చివరికి కరుణ, ఐక్యత మరియు మానవ సేవకు ప్రతీకగా నిలిచి, వందలాది మందికి ఆశ, నమ్మకం మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించింది.<br />— ఎం. సిరాజ్<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260513-wa0000.jpg" alt="IMG-20260513-WA0000" width="1600" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>NRI</category>
                                    

                <link>https://www.churakalu.com/nri/free-cardiology-camp-in-riyadh/article-1077</link>
                <guid>https://www.churakalu.com/nri/free-cardiology-camp-in-riyadh/article-1077</guid>
                <pubDate>Wed, 13 May 2026 22:17:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260513-wa0001.jpg"                         length="156415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి, ఎమ్మెల్యే ను కల్సిన మైనార్టీ నాయకులు </title>
                                    <description><![CDATA[<p>మైనార్టీలకు నామీనేటెడ్ పోస్ట్లు కేటాయుంచాలి </p>
<p>జగిత్యాల,</p>
<p><br />  జగిత్యాల ముస్లిం సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు, జగిత్యాల యువత తరపున జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.<br />*జగిత్యాల ముస్లిం సమాజం నుండి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ - స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు / డైరెక్టర్ పోస్టుల నియామకం చేయాలి.*<br />కుల్ జమాత్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మసీదుల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సామాజిక సంస్థల బాధ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే జగిత్యాలను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. జగిత్యాల ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని, ముస్లింలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అందులో పేర్కొన్నారు. అది మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా అదే వైఖరి కొనసాగుతోందని,<br />, తెలంగాణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/minority-leaders-who-elected-mla-should-allocate-nominated-posts-to/article-1076"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260512-wa0000.jpg" alt=""></a><br /><p>మైనార్టీలకు నామీనేటెడ్ పోస్ట్లు కేటాయుంచాలి </p>
<p>జగిత్యాల,</p>
<p><br /> జగిత్యాల ముస్లిం సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు, జగిత్యాల యువత తరపున జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.<br />*జగిత్యాల ముస్లిం సమాజం నుండి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ - స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు / డైరెక్టర్ పోస్టుల నియామకం చేయాలి.*<br />కుల్ జమాత్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మసీదుల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సామాజిక సంస్థల బాధ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే జగిత్యాలను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. జగిత్యాల ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని, ముస్లింలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అందులో పేర్కొన్నారు. అది మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా అదే వైఖరి కొనసాగుతోందని,<br />, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు, అంటే రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకు జగిత్యాల ముస్లిం వర్గం నుండి ఎవరికీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు.<br /> జగిత్యాల క్రియాశీల నాయకుడు, టీపీసీ సీనియర్ లీడర్, మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల మాజీ అధ్యక్షుడు మీర్ కాజిం అలీని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలి. వీరితో పాటు మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలి.*<br />ఈ చర్య ద్వారా ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుంది మరియు కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుంది.<br />*డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే, మీర్ కాజిం అలీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.*<br />ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్నవారు:- జనాబ్ షరఫుద్దీన్ , అమీర్ తబ్లీగీ జమాత్ జగిత్యాల జిల్లా- హాఫిజ్ సయ్యద్ షంసుద్దీన్ తబ్రేజ్ , అధ్యక్షుడు జమియత్ ఉలమా జగిత్యాల  <br />- అబ్దుల్ జలీల్ , అధ్యక్షుడు అహ్లే హదీస్ జగిత్యాల- ఎం.ఏ. సలీం అబిద్ , జనరల్ సెక్రటరీ అహ్లే సున్నతుల్ జమాత్ జగిత్యాల- ఖాజా లియాఖత్ అలీ మొహ్సిన్ , జిల్లా అధ్యక్షుడు యం. ఐ. యం,జగిత్యాల- ఖాజీ మక్సూద్ అలీ మతీన్ గ, అధ్యక్షుడు ఖాజీ జగిత్యాల జిల్లా- సుమేర్ ఉద్దీన్ ఆజాద్ , అధ్యక్షుడు యం. ఐ. యం జగిత్యాల టౌన్- ఎం.ఏ. రజీ ఉద్దీన్ , యం. ఐ. యం కౌన్సిలర్ ఇస్లాంపుర,- డా. ఎం.డి. అయూబ్ ఖాన్ , యం ఐ యం,కౌన్సిలర్ 34వ వార్డు, ఉపాధ్యక్షుడు ముస్లిం కమిటీ జగిత్యాల- ముజాహిద్ ఆదిల్  అధ్యక్షుడు మసీద్-ఎ-పురానిపేట్- షేక్ నజీర్ అహ్మద్ , అధ్యక్షుడు మసీద్-ఎ-జం జం- ఇర్ఫాన్ జాఫర్ రషీద్ గారు, సీనియర్ రిపోర్టర్  ఖాజా అమీర్ ఉద్దీన్ , జనరల్ సెక్రటరీ యం. ఐ యం.- అబ్దుల్ రెహ్మాన్ , జిల్లా ఇ. సి సభ్యుడు యం ఐ యం <br />ఆరిఫ్ హుస్సేన్ , జనరల్ సెక్రటరీ ఈద్గా కమిటీ జగిత్యాల- ఎం.డి. రియాజ్ ఉద్దీన్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ మరియు కాంగ్రెస్ పార్టీ<br />- బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260512-wa0001.jpg" alt="IMG-20260512-WA0001" width="900" height="640"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/minority-leaders-who-elected-mla-should-allocate-nominated-posts-to/article-1076</link>
                <guid>https://www.churakalu.com/regional/minority-leaders-who-elected-mla-should-allocate-nominated-posts-to/article-1076</guid>
                <pubDate>Tue, 12 May 2026 12:27:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260512-wa0000.jpg"                         length="303864"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ </title>
                                    <description><![CDATA[<p>బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ </p>
<p>-భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు</p>
<p>-ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా...</p>
<p>-మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...</p>
<p>  -వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి</p>
<p>-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే<br />    వొడితెల సతీష్ కుమార్</p>
<p>చురకలు ప్రతినిధి కరీంనగర్ మే 11</p>
<p><br />కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఆయన కొడుకు భగీరథ్ ఫోక్సో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఉన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/revanth-sarkar-anda-to-bandi-sanjay/article-1075"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260511-wa0008.jpg" alt=""></a><br /><p>బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ </p>
<p>-భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు</p>
<p>-ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా...</p>
<p>-మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...</p>
<p> -వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి</p>
<p>-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే<br />  వొడితెల సతీష్ కుమార్</p>
<p>చురకలు ప్రతినిధి కరీంనగర్ మే 11</p>
<p><br />కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఆయన కొడుకు భగీరథ్ ఫోక్సో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అరెస్టు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.  ఫిర్యాదు చేసిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. పోక్సో కేసు కాకుండా సాధారణ కేసు నమోదు చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మంత్రుల కొడుకుల కైతే ఒక న్యాయం... ఇతరులకు మరొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. వెంటనే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో చట్టాలపై ప్రజలకు ఉన్న గౌరవం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. భగీరథ్ కేసులో ఇంకా జాప్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని సతీష్ కుమార్ హెచ్చరించారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0008.jpg" alt="IMG-20260511-WA0008" width="1067" height="874"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/revanth-sarkar-anda-to-bandi-sanjay/article-1075</link>
                <guid>https://www.churakalu.com/regional/revanth-sarkar-anda-to-bandi-sanjay/article-1075</guid>
                <pubDate>Mon, 11 May 2026 15:51:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0008.jpg"                         length="71371"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్ </title>
                                    <description><![CDATA[<p>గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ </p>
<p>జగిత్యాల </p>
<p>ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0007.jpg" alt="IMG-20260511-WA0007" width="1200" height="853" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/sp-ashok-kumar-who-examined-the-complaints-on-the-occasion/article-1074"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260511-wa0004.jpg" alt=""></a><br /><p>గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ </p>
<p>జగిత్యాల </p>
<p>ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0007.jpg" alt="IMG-20260511-WA0007" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/sp-ashok-kumar-who-examined-the-complaints-on-the-occasion/article-1074</link>
                <guid>https://www.churakalu.com/regional/sp-ashok-kumar-who-examined-the-complaints-on-the-occasion/article-1074</guid>
                <pubDate>Mon, 11 May 2026 15:46:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0004.jpg"                         length="77555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సౌదీలో గొర్రల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు </title>
                                    <description><![CDATA[<p>సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు</p>
<p>రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు</p>
<p>సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి</p>
<p>రియాద్, </p>
<p>సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టు బట్టం రాజ్‌పల్లి (బీబీ రాజ్‌పల్లి) గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23)ను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని, మోసం చేసిన ఎజెంట్‌పై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.</p>
<p>ఈ అంశంపై వెంటనే స్పందించిన సీఎం ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి, తగిన చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై విభాగం అధికారులతో పాటు జగిత్యాల ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/nri/a-young-man-struggling-as-a-shepherd-in-saudi/article-1073"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260511-wa0003.jpg" alt=""></a><br /><p>సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు</p>
<p>రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు</p>
<p>సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి</p>
<p>రియాద్, </p>
<p>సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టు బట్టం రాజ్‌పల్లి (బీబీ రాజ్‌పల్లి) గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23)ను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని, మోసం చేసిన ఎజెంట్‌పై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.</p>
<p>ఈ అంశంపై వెంటనే స్పందించిన సీఎం ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి, తగిన చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై విభాగం అధికారులతో పాటు జగిత్యాల ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, ఏసీపీ ఉమేందర్, వాలంటీర్ పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.</p>
<p>అరవింద్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ఏజెంట్, రూ.90 వేల రూపాయలు తీసుకుని చివరకు ఎడారిలో గొర్రెల కాపరిగా పని చేయిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.</p>
<p>అక్కడ తాగునీరు, ఆహారం, విద్యుత్, సరైన వసతి సదుపాయాలు లేక అరవింద్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతను పంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యజమాని బలవంతంగా అతని వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించడమే కాకుండా, ఇండియా సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.</p>
<p>ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలో తెలుగు వారికే ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని ముందుకు వచ్చిన సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపకులు మల్లేశన్‌తో పాటు వివిధ ప్రాంతాల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, తేజ పళ్లెం, రాంరెడ్డి, మల్లేశం జవ్వాజీ,  శంకర్ ముదిగొండ, నరేష్ సింగు, ముజమిలొద్దీన్, నూరద్దీన్ మరియు కోర్ టీమ్ సభ్యులు స్పందించారు.</p>
<p>సకాక ప్రాంతంలో ఉన్న సాటా టీమ్ సభ్యులు, కర్నూలు కు చెందిన డా. వినోద్ బందెల, వేములవాడ కు చెందిన మదన్, లక్ష్మణ్ మరియు మిత్రులు హుటాహుటిన అరవింద్ ఉన్న ప్రాంతానికి వెళ్లి అతనిని కలిసి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సాటా తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0003.jpg" alt="IMG-20260511-WA0003" width="1220" height="1131"></img></p>]]></content:encoded>
                
                                                            <category>NRI</category>
                                    

                <link>https://www.churakalu.com/nri/a-young-man-struggling-as-a-shepherd-in-saudi/article-1073</link>
                <guid>https://www.churakalu.com/nri/a-young-man-struggling-as-a-shepherd-in-saudi/article-1073</guid>
                <pubDate>Mon, 11 May 2026 15:40:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0003.jpg"                         length="162265"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సౌదీ అరేబియాలో చారిత్రాత్మక మినీ మహానాడు,- పసుపు మయమైన దమ్మమ్ </title>
                                    <description><![CDATA[<p>*సౌదీ అరేబియాలో చారిత్రాత్మక 'మినీ మహానాడు' – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !*</p>
<p>2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు,  ప్రభాకర రెడ్డి, దిలీప్ ,కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజ్యలక్ష్మి నందమూరి, శారద కోనేరు, వర్దిని బులుసు, అనిత నాగశేఖర్, సత్య మల్లిన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం సౌదీ అరేబియా తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణం అంతా పసుపు రంగుతో అలంకరించబడటం ప్రత్యేక ఆకర్షణగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/nri/dammam-is-the-historic-mini-mahanadu-in-saudi-arabia/article-1072"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260511-wa0001.jpg" alt=""></a><br /><p>*సౌదీ అరేబియాలో చారిత్రాత్మక 'మినీ మహానాడు' – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !*</p>
<p>2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు,  ప్రభాకర రెడ్డి, దిలీప్ ,కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజ్యలక్ష్మి నందమూరి, శారద కోనేరు, వర్దిని బులుసు, అనిత నాగశేఖర్, సత్య మల్లిన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం సౌదీ అరేబియా తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణం అంతా పసుపు రంగుతో అలంకరించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.</p>
<p>ఈ మహానాడు కార్యక్రమం “మా తెలుగు తల్లి” గీతంతో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం మొత్తం చిన్నారుల నృత్యాలు, ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. రాజకీయ ప్రసంగాలకు శ్రీ నాగశేఖర్ గారు, మరియు శ్రీమతి సత్య మల్లిన గారు సాంస్కృతిక కార్యక్రమాలకు  వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.</p>
<p>ఈ మహానాడులో ప్రధాన ఆకర్షణ చిన్నారులే! భవిష్యత్తు టీడీపీ వారసులుగా భావిస్తున్న పిల్లలు **"జై తెలుగుదేశం"** నినాదాలతో ర్యాలీగా సభకు రావడం అందరినీ అలరించింది. వారి నృత్యాలు, అనర్గళమైన ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. అనేక మంది నాయకులు తమ అనుభవాలను, తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని వేదికపై పంచుకున్నారు. యువతకు కూడా ప్రసంగించే అవకాశం కల్పించడం ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.</p>
<p>జూమ్ కాల్ ద్వారా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు గారు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ చరిత్రను, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.</p>
<p>తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్ధన్ గారు మరియు నందమూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ మహానాడు ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రజలతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.</p>
<p>తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరప్రసాద్ గారు మాట్లాడుతూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, P4 స్ఫూర్తితో తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి) ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో రూ.30 లక్షల వ్యయంతో “హైందవ స్వర్గధామం” ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా, ఇతర సేవా కార్యక్రమాలకు గాను ప్రకాశం జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి చేత సత్కారం అందుకోవడం, అలాగే జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా P4 ప్రశంసా పత్రం అందుకోవడం విశేషంగా నిలిచిందని పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా సౌదీ అరేబియా నుండి మొట్టమొదటిగా P4 ప్రశంసా పత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉందని తెలిపారు.</p>
<p>జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ నుండి 100కు పైగా టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు ఉత్సాహంగా కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జుబైల్ బృందం ప్రతి శుక్రవారం సెలవుదినంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భీమా నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కూడా వారు పంచుకున్నారు. గతంలో ప్రవాసాంధ్రులు సర్టిఫికెట్లు పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇప్పుడు WhatsApp గవర్నెన్స్ ద్వారా ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని పేర్కొంటూ శ్రీ నారా లోకేష్ గారిని ప్రశంసించారు.</p>
<p>తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం స్థాపించబడిన పార్టీ అని, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, అండమాన్ అయినా, చివరికి అమెరికా అయినా — తెలుగు ప్రజల హృదయాల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. APNRTS సేవలు, P4 కార్యక్రమం, అలాగే APNRTS ప్రవాసాంధ్ర భీమా వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, త్వరలోనే పలు ప్రణాళికలను అమలులోకి తీసుకువస్తామని తెలిపారు.</p>
<p>*NRI TDP, SAUDI ARABIA సభ్యులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), ఖాదర్ షేక్, రవి మేడూరి, హరీష్ తదితరులు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ “మినీ మహానాడు” కార్యక్రమం ఊహించిన దానికంటే ఘన విజయాన్ని సాధించడం శుభసూచికమని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వేదికపై మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం అందరినీ ఆకట్టుకుందని పేర్కొన్నారు.</p>
<p>ప్రత్యేకంగా చిన్నారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా సౌదీ అరేబియా – తూర్పు ప్రాంతం ముందడుగు వేస్తోందని అన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే నాయకులు మొదటిగా  ఇక్కడి నుంచే వెలువడతారనే నమ్మకం వ్యక్తం చేశారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0002.jpg" alt="IMG-20260511-WA0002" width="2560" height="1706"></img></p>]]></content:encoded>
                
                                                            <category>NRI</category>
                                    

                <link>https://www.churakalu.com/nri/dammam-is-the-historic-mini-mahanadu-in-saudi-arabia/article-1072</link>
                <guid>https://www.churakalu.com/nri/dammam-is-the-historic-mini-mahanadu-in-saudi-arabia/article-1072</guid>
                <pubDate>Mon, 11 May 2026 15:20:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0001.jpg"                         length="1185352"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత.... గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి </title>
                                    <description><![CDATA[<p>కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత</p>
<p>బండి సంజయ్ పై పాడి కౌశిక్ తీవ్రవ్యాఖ్యలు</p>
<p>గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి</p>
<p>కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం.. రంగంలోకి పోలీసులు</p>
<p><br />చురకలు కరీంనగర్ బ్యూరో: </p>
<p>కరీంనగర్లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.</p>
<p><br />బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్దకు భారీగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/political-tension-in-karimnagar-bjp-attack-on-gangula-camp-office/article-1070"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260507-wa0002.jpg" alt=""></a><br /><p>కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత</p>
<p>బండి సంజయ్ పై పాడి కౌశిక్ తీవ్రవ్యాఖ్యలు</p>
<p>గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి</p>
<p>కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం.. రంగంలోకి పోలీసులు</p>
<p><br />చురకలు కరీంనగర్ బ్యూరో: </p>
<p>కరీంనగర్లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.</p>
<p><br />బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కరీంనగర్ పట్టణంలో అదనపు సిబ్బందితో నిఘా పెంచారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, దానికి నిరసనగా బీజేపీ శ్రేణులు చేసిన దాడితో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గంగుల ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు పాడి కౌశిక్ రెడ్డి రాగా.. బీజేపీ శ్రేణులు ఆ కార్యాలయంపై దాడి చేశారు. లోపల కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం కొనసాగుతుండగానే.. బీజేపీ కార్యకర్తలు కార్యాలయంపై దాడిచేశారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.</p>
<p><br />"బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉంది"</p>
<p>కరీంనగర్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కు బట్టతల వచ్చిందని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తమకు కూడా చేతనవుతుందని, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో ఆయన తన భార్య పుస్తెల్ని అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారన్నారు. ఎన్నికల్లో బండిసంజయ్ పంచినద అవినీతి డబ్బా లేక రేవంత్ పంపిన డబ్బా అని ప్రశ్నించారు. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఏ అంశం మీదనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కౌశిక్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ ను తాను తీసుకొస్తానని, ఇందుకు బండి సంజయ్ కూడా సిద్ధం కావాలని సవాల్ చేశారు. బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో దాడులకు పాల్పడ్డారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260507-wa0005.jpg" alt="IMG-20260507-WA0005" width="936" height="566"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/political-tension-in-karimnagar-bjp-attack-on-gangula-camp-office/article-1070</link>
                <guid>https://www.churakalu.com/telangana/political-tension-in-karimnagar-bjp-attack-on-gangula-camp-office/article-1070</guid>
                <pubDate>Thu, 07 May 2026 13:58:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260507-wa0002.jpg"                         length="101899"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి హైకోర్టు లో టీడబ్ల్యుజేఎఫ్ పిటిషన్ </title>
                                    <description><![CDATA[<p>*అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి*<br />*-హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్*</p>
<p>హైదరాబాద్, మే 05: మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్<br />(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/twjf-petition-in-high-court-to-stay-decisions-of-accreditation/article-1069"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260505-wa0010.jpg" alt=""></a><br /><p>*అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి*<br />*-హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్*</p>
<p>హైదరాబాద్, మే 05: మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్<br />(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మెన్ లతో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులు<br />(డీపీఆర్వో)లను ప్రతివాదులుగా చేర్చారు.<br />*అక్రెడిటేషన్ కమిటీల జీవో 229 రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్*<br />రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మీడియా అక్రెడిటేషన్ల జీవో 252 కి అనుబంధంగా రాష్ట్ర, జిల్లా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో ఆర్టీ 229 ను నిబంధనలకు విరుద్దంగా అమలు చేసినందున ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టు లో మంగళవారం పిటిషన్ దాఖలైంది. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడు, ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు అనే జర్నలిస్టు జీవో 229 అమలు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అక్రెడిటేషన్ కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఉండాలని జీవో 252లో పేర్కొనగా, జీవో ఆర్టీ 229 ద్వారా కేవలం మూడు సంఘాల ప్రతినిధులను మాత్రమే తీసుకున్నారని, టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ప్రతినిధులను కమిటీల్లోకి తీసుకోకుండా కమిటీ నిర్ణయాలు చేయడం జీవో 252 కు విరుద్దమని, అందుకని ఈ జీవో ఆర్టీ 229ను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటీషన్ లో కూడా ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ ను, మీడియా అకాడమీ ఛైర్మన్,అన్ని జిల్లాల డీపీఆర్వోలను ప్రతివాదులుగా చేర్చారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260505-wa0010.jpg" alt="IMG-20260505-WA0010" width="1599" height="1466"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/twjf-petition-in-high-court-to-stay-decisions-of-accreditation/article-1069</link>
                <guid>https://www.churakalu.com/telangana/twjf-petition-in-high-court-to-stay-decisions-of-accreditation/article-1069</guid>
                <pubDate>Tue, 05 May 2026 19:23:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260505-wa0010.jpg"                         length="238819"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి </p>
<p>జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం పనిచేశారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260427-wa0007.jpg" alt="IMG-20260427-WA0007" width="1024" height="682" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/purushottam-reddy-as-dsp-of-jagityal/article-1068"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260427-wa0007.jpg" alt=""></a><br /><p>జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి </p>
<p>జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం పనిచేశారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260427-wa0007.jpg" alt="IMG-20260427-WA0007" width="1024" height="682"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/purushottam-reddy-as-dsp-of-jagityal/article-1068</link>
                <guid>https://www.churakalu.com/regional/purushottam-reddy-as-dsp-of-jagityal/article-1068</guid>
                <pubDate>Mon, 27 Apr 2026 22:49:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260427-wa0007.jpg"                         length="84073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        