<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.churakalu.com/telangana/category-2" rel="self" type="application/rss+xml" />
                <generator>Churakalu RSS Feed Generator</generator>
                <title>Telangana - Churakalu</title>
                <link>https://www.churakalu.com/category/2/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల ముఖ్య నాయకులతో ముగిసిన ముఖ్యమంత్రి రెడ్డి భేటీ. </p>
<p>జగిత్యాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి <img src="https://www.churakalu.com/media/2026-04/img-20260414-wa0177.jpg" alt="IMG-20260414-WA0177" width="1200" height="855" /></p>
<p>రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యా. </p>
<p>మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూడలేదు.. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు </p>
<p>ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు </p>
<p>2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం </p>
<p>పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం </p>
<p>కానీ ఆయన నిజామాబాద్  నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చింది. </p>
<p>దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు </p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు సూచించిన వారికే టికెట్లు ఇచ్చాం </p>
<p>భవిష్యత్ లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ కు హామీ ఇచ్చినా వినలేదు. </p>
<p>మొండి పట్టుతో జీవన్ రెడ్డి గారు పార్టీ వీడారు </p>
<p>40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి… దుర్మార్గుడైన కెసిఆర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/chief-minister-revanth-reddy-did-not-underestimate-jeevan-reddy/article-1063"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260414-wa0175.jpg" alt=""></a><br /><p>జగిత్యాల ముఖ్య నాయకులతో ముగిసిన ముఖ్యమంత్రి రెడ్డి భేటీ. </p>
<p>జగిత్యాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి <img src="https://www.churakalu.com/media/2026-04/img-20260414-wa0177.jpg" alt="IMG-20260414-WA0177" width="1280" height="855"></img></p>
<p>రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యా. </p>
<p>మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూడలేదు.. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు </p>
<p>ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు </p>
<p>2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం </p>
<p>పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం </p>
<p>కానీ ఆయన నిజామాబాద్  నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చింది. </p>
<p>దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు </p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు సూచించిన వారికే టికెట్లు ఇచ్చాం </p>
<p>భవిష్యత్ లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ కు హామీ ఇచ్చినా వినలేదు. </p>
<p>మొండి పట్టుతో జీవన్ రెడ్డి గారు పార్టీ వీడారు </p>
<p>40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి… దుర్మార్గుడైన కెసిఆర్ తో జతకట్టారు.</p>
<p>జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం</p>
<p>జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి గారు కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు </p>
<p>ఆయన వయసుకు,అనుభవానికి ఇది తగదు </p>
<p>ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదు </p>
<p>కుట్రలను తిప్పి కొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే… ఆయన వెళ్లి అక్కడ చేరారు.</p>
<p>ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా..</p>
<p>నేను చేస్తుంది మంచో చెడో మీరే ఆలోచించండి </p>
<p>ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది </p>
<p>అండగా నిలబడండి… మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం </p>
<p>ధైర్యంగా ఉండండి…త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా…</p>
<p>అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం </p>
<p>వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నా..</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/chief-minister-revanth-reddy-did-not-underestimate-jeevan-reddy/article-1063</link>
                <guid>https://www.churakalu.com/telangana/chief-minister-revanth-reddy-did-not-underestimate-jeevan-reddy/article-1063</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 21:07:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260414-wa0175.jpg"                         length="103468"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల కఠిన  శ్రమతోనే ఉత్తమ ఫలితాలు, ఆల్పోర్స్ చైర్మన్ వి, నరేందర్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>విద్యార్థుల కఠిన శ్రమతోనే ఉత్తమ ఫలితాలు. </p>
<p>అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి.</p>
<p>చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 14 : విద్యార్థుల కఠిన శ్రమ, అధ్యాపకుల సరైన మార్గనిర్దేశనంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అల్ఫోర్స్ కళాశాలలో ఇటీవలే విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులను డా. నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం.పి.సి, బై.పి.సి, సి.ఈ.సి, ఎం.ఈ.సి విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారన్నారు. ఎంపిసి ఫస్ట్ ఇయర్ జీ స్నేహిత, 468/470, రాచర్ల ఆశ్విత వర్మ,- 468/470, తుమ్మనపల్లి సహస్ర- 468/470, లవంగ శ్రీజ- 468/470 మార్కులతో మొదటి స్థానంలో నిలువగా సహస్ర 467/470 జోసెఫ్ 467/470 మరియమ్, 467/470, టి. అప్తిచంద్ర 467/470 మార్కులు సాధించారు. ఎంపిసి సెకండ్ ఇయర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/allpores-chairman-v-narender-reddy-said-the-best-results-are/article-1062"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260414-wa0130.jpg" alt=""></a><br /><p>విద్యార్థుల కఠిన శ్రమతోనే ఉత్తమ ఫలితాలు. </p>
<p>అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి.</p>
<p>చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 14 : విద్యార్థుల కఠిన శ్రమ, అధ్యాపకుల సరైన మార్గనిర్దేశనంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అల్ఫోర్స్ కళాశాలలో ఇటీవలే విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులను డా. నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం.పి.సి, బై.పి.సి, సి.ఈ.సి, ఎం.ఈ.సి విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారన్నారు. ఎంపిసి ఫస్ట్ ఇయర్ జీ స్నేహిత, 468/470, రాచర్ల ఆశ్విత వర్మ,- 468/470, తుమ్మనపల్లి సహస్ర- 468/470, లవంగ శ్రీజ- 468/470 మార్కులతో మొదటి స్థానంలో నిలువగా సహస్ర 467/470 జోసెఫ్ 467/470 మరియమ్, 467/470, టి. అప్తిచంద్ర 467/470 మార్కులు సాధించారు. ఎంపిసి సెకండ్ ఇయర్ లో లహరి సందరికారి -995/1000- మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, నవ్య పల్లికొండ 994, లాస్య రెడ్డి గోగురి 993 మార్కులు సాధించారని తెలిపారు. బైపిసి విభాగం సెకండ్ ఇయర్ అన్సా హురియా 994/1000, సోబియా తస్నీమ్ 994/1000, రీష ఫాతిమా 993/1000 మార్కులతో సత్తా చాటారు. బైపిసి ఫస్ట్ఇయర్ అల్మాస్ ఫాతిమా -438/440- శ్రీలక్ష్మి 437/440 మార్కులు, ఎల్ శ్రీలక్ష్మి 437/440, హనఫా హననియా 436 / 440, నబియా నౌసిన్ 436/440, సఫరా జుఫీషా 436/440, ఏం అక్షయ 436/440, మార్కులు సాధించారని, సిఈసి విభాగం ఫస్ట్ ఇయర్ లో అన్నం మెహరోజ్ -494/500, డి వైష్ణవి 491/500, కే శ్రీ వర్ష 488/500, కే ప్రణీత 488/500 అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, సిఈసి సెకండ్ ఇయర్ లో బావజ్ఞ పెల్లె -987– ఎండి సంసియా 984/1000, మౌనిక 984/1000, అర్పాత్ అనీమ్ 983 / 1000 మార్కులు సాధించారన్నారు. ఎంఈసి సెకండ్ ఇయర్లో నిస్మా తబస్సుమ్ 980/1000 మార్కులతో ఘన విజయం సాధించారన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260414-wa0133.jpg" alt="IMG-20260414-WA0133" width="4160" height="2767"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/allpores-chairman-v-narender-reddy-said-the-best-results-are/article-1062</link>
                <guid>https://www.churakalu.com/telangana/allpores-chairman-v-narender-reddy-said-the-best-results-are/article-1062</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 20:36:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260414-wa0130.jpg"                         length="709502"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మతమంటే జీవన విధానం </title>
                                    <description><![CDATA[<p>మతమంటే జీవన విధానం: హిందుత్వ వైభవాన్ని చాటిన ధర్మపురి సమ్మేళనం...</p>
<p>.............................................</p>
<p>ధర్మపురి క్షేత్రాన ధర్మధ్వజం: హిందూ సమాజ ఐక్యతకు చైతన్య గీతం</p>
<p>.......................................</p>
<p>సమరస సమాజమే ధర్మ లక్ష్యం: జగన్నాథం విష్ణువర్ధనాచార్య ప్రబోధం</p>
<p>..........................................</p>
<p>  </p>
<p>రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494</p>
<p>.................................</p>
<p>  </p>
<p>ధర్మపురి పుణ్యక్షేత్రం వేదికగా సాగిన హిందూ సమ్మేళనం కేవలం ఒక సమూహ కలయికగానే కాక, కాలప్రవాహంలో మరుగున పడుతున్న సనాతన ధర్మ మూలాలను తట్టిలేపి, హిందూ సమాజ ఐక్యతకు దిశానిర్దేశం చేసిన ఒక చారిత్రక ఘట్టంగా భాసిల్లింది. ఈ సమ్మేళనంలో వినిపించిన గొంతుకలు, ప్రవచించిన సిద్ధాంతాలు భారతీయ జీవన విధానంలోని విశిష్టతను చాటిచెప్పడమే కాక, ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఆధ్యాత్మిక, సామాజిక పరిష్కారాలను సూచించాయి. ముఖ్యంగా జగన్నాథం విష్ణువర్ధనాచార్య వంటి ఆధ్యాత్మిక కోవిదుల ప్రసంగాలు సభకు ప్రాణవాయువుగా నిలిచి, ప్రతి హిందువు తన బాధ్యతను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.</p>
<p>​విశ్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/religion-is-a-way-of-life/article-1061"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260412-wa0101.jpg" alt=""></a><br /><p>మతమంటే జీవన విధానం: హిందుత్వ వైభవాన్ని చాటిన ధర్మపురి సమ్మేళనం...</p>
<p>.............................................</p>
<p>ధర్మపురి క్షేత్రాన ధర్మధ్వజం: హిందూ సమాజ ఐక్యతకు చైతన్య గీతం</p>
<p>.......................................</p>
<p>సమరస సమాజమే ధర్మ లక్ష్యం: జగన్నాథం విష్ణువర్ధనాచార్య ప్రబోధం</p>
<p>..........................................</p>
<p> </p>
<p>రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494</p>
<p>.................................</p>
<p> </p>
<p>ధర్మపురి పుణ్యక్షేత్రం వేదికగా సాగిన హిందూ సమ్మేళనం కేవలం ఒక సమూహ కలయికగానే కాక, కాలప్రవాహంలో మరుగున పడుతున్న సనాతన ధర్మ మూలాలను తట్టిలేపి, హిందూ సమాజ ఐక్యతకు దిశానిర్దేశం చేసిన ఒక చారిత్రక ఘట్టంగా భాసిల్లింది. ఈ సమ్మేళనంలో వినిపించిన గొంతుకలు, ప్రవచించిన సిద్ధాంతాలు భారతీయ జీవన విధానంలోని విశిష్టతను చాటిచెప్పడమే కాక, ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఆధ్యాత్మిక, సామాజిక పరిష్కారాలను సూచించాయి. ముఖ్యంగా జగన్నాథం విష్ణువర్ధనాచార్య వంటి ఆధ్యాత్మిక కోవిదుల ప్రసంగాలు సభకు ప్రాణవాయువుగా నిలిచి, ప్రతి హిందువు తన బాధ్యతను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.</p>
<p>​విశ్వం అనేది సహస్రశీర్ష పురుషుని స్వరూపమని, ఆ అనంత విశ్వంలో మానవుడు అతి స్వల్పమైన వాడని ఉభయ వేదాంత పండిత ప్రకాండులు విష్ణువర్ధనాచార్య చేసిన విశ్లేషణ శ్రోతలలో వినయ విధేయతలను రేకెత్తించింది. తల్లి, తండ్రి, గురువు అనే త్రిమూర్తుల సేవ ద్వారానే మనిషి జీవితం సార్థక మవుతుందన్న ఆయన మాటలు భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తుచేశాయి. కుటుంబమే సమాజానికి మూలమని, ఉత్తమ తల్లిదండ్రులు ఉన్నప్పుడే క్రమశిక్షణ గల సంతానం ఉద్భవిస్తుందని, అప్పుడే దేశం శక్తివంతమవుతుందని ఆయన వివరించిన తీరు అద్భుతం. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లిన సనాతన ధర్మం, నేడు కేవలం భారతదేశానికే పరిమితం కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హిందూ ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలు మాత్రమే కాదని, అది ప్రకృతి సమతుల్యతను కాపాడే ఒక జీవన సూత్రమని, దీనికి భంగం కలిగితే ప్రపంచ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించడం అత్యంత ఆలోచనాత్మకం. ఇతర మతాల దాడులు, అంతర్గత కుల విభేదాలు, అధర్మ ఆచరణలు సనాతన ధర్మాన్ని బలహీన పరుస్తున్నాయని, వీటిని అధిగమించాలంటే హిందువులందరూ భేదభావాలను విడనాడి ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p> ఇమ్మడి శ్రీనివాస్ సమర్థ నాయకత్వంలో సమ్మేళనం గంభీరంగా సాగింది. కార్యక్రమం ఆరంభంలో వెలిగించిన జ్యోతి ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లడమే కాక, సమాజంలో నెలకొన్న అజ్ఞానపు చీకట్లను పారద్రోలే జ్ఞానదీపంగా నిలిచింది. రంగు లక్ష్మీ నరహరి తన ప్రసంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ద కాలపు ప్రస్థానాన్ని వివరిస్తూ, ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొని సంస్థ ఎలా నిలదొక్కుకుందో వివరించారు. ప్రతి ఇంటికి హిందూ జాగరణను తీసుకెళ్లడంలో ఆరెస్సెస్ పాత్ర అద్వితీయమని, శివాజీ. భగత్ సింగ్ వంటి ధైర్యసాహసాలు గల యువతను తయారు చేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలంటే ముందుగా యువతలో చైతన్యం రావాలన్న ఆయన పిలుపు సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది.</p>
<p>​మరోవైపు జర్నలిస్ట్ నవత ప్రసంగం సామాజిక బాధ్యతను గుర్తుచేసే విధంగా సాగింది. భారతదేశంలో జన్మించడం అనేది పూర్వజన్మ సుకృతమని చెబుతూ, స్వార్థచింతన వీడి సమాజ సేవకు అంకితం కావాలన్నారు. ఆమె ప్రతిపాదించిన 'పంచ పరివర్తన' మార్గదర్శకాలు నేటి సమాజానికి దిక్సూచి వంటివి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రహిత జీవనం, జల సంరక్షణ, వృక్షోపాసన చేయాలని ఆమె కోరారు. కుటుంబ విలువలను కాపాడుకోవాలని, కుల వ్యవస్థ పేరుతో విదేశీయులు నాటిన విభజన బీజాలను పెకిలించి వేయాలని, సమరసతతో కూడిన సమాజాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా ఆర్థికంగా బలపడాలని, తద్వారా గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించడం లోతైన విశ్లేషణకు నిదర్శనం.</p>
<p>​సనాతన సంప్రదాయాల్లోని శాస్త్రీయతను మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. భారత భూమిని కేవలం భూభాగంగా కాకుండా ఒక పూజామందిరంగా భావించాలని, "వసుధైవ కుటుంబకం" అనే భావనతో జీవించాలని ఆమె అన్నారు. మనం పాటించే కట్టు, బొట్టు వెనుక ఉన్న అంతరార్థాలను వివరిస్తూ, సంప్రదాయబద్ధమైన జీవనం శారీరక, మానసిక వికాసానికి ఎలా తోడ్పడుతుందో ఆమె స్పష్టం చేశారు. </p>
<p>అలాగే, ప్రధాన వక్త సామల కిరణ్ గారు శేషప్ప పద్యాలతో ప్రసంగాన్ని రక్తి కట్టిస్తూ, హిందూత్వం అనేది ఒక మతం కాదని, అది అనంతమైన జీవన ప్రవాహమని పేర్కొన్నారు. దేవుడిని నమ్మే వారిని, నమ్మని వారిని కూడా తనలో కలుపుకునే విశాల హృదయం హిందూ ధర్మానికి మాత్రమే ఉందని ఆయన చెప్పిన మాటలు భారతీయ సంస్కృతిలోని సహనాన్ని చాటిచెప్పాయి.</p>
<p>​సభా ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు కేవలం వినోదం కోసమే కాకుండా, భారతీయ కళా వైభవాన్ని కళ్లకు కట్టేలా సాగాయి. నక్కలపేట మోడల్ స్కూల్ మరియు చైతన్య భారతి పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు దేశభక్తిని, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించాయి. ఈ ప్రదర్శనలు చూస్తుంటే, మన సంస్కృతి సురక్షితమైన చేతుల్లోనే ఉందన్న భరోసా కలిగింది.</p>
<p>​ ధర్మపురి హిందూ సమ్మేళనం అనేది ఒక ఆలోచనాత్మక విశ్లేషణకు వేదికైంది. కులాల విభజనను దాటి, స్వార్థ రాజకీయాలను వీడి, హిందూ సమాజం ఒక్కటిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సభ ఘోషించింది. వ్యక్తిగత పరివర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని, ఆ మార్పు కుటుంబం నుండి ప్రారంభం కావాలని వక్తలు ముక్తకంఠంతో చాటారు. పర్యావరణంపై మమకారం, స్వదేశీ వస్తువులపై గౌరవం, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగినప్పుడే భారత్ తన పూర్వ వైభవాన్ని సంతరించు కుంటుంది. హిందూ ధర్మ పరిరక్షణే ప్రపంచ శాంతికి మూలమని, అది మనందరి సమిష్టి బాధ్యతని ఈ సమ్మేళనం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ స్ఫూర్తి ప్రతి హిందువు గుండెలో నిలిచి, సమాజ చైతన్యానికి నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు. అప్పుడే మన దేశం నిజమైన అర్థంలో విశ్వగురువుగా వెలుగొందుతుంది. ఈ దిశగా సాగిన ప్రతి అడుగు, ప్రతి ప్రసంగం హిందూ సమాజ ఐక్యతకు పటిష్టమైన పునాదిగా నిలవాలని సమ్మేళనం ఆశిస్తున్నది.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260412-wa0100.jpg" alt="IMG-20260412-WA0100" width="1280" height="960"></img><img src="https://www.churakalu.com/media/2026-04/img-20260412-wa0100.jpg" alt="IMG-20260412-WA0100" width="1280" height="960"></img><img src="https://www.churakalu.com/media/2026-04/img-20260412-wa0100.jpg" alt="IMG-20260412-WA0100" width="1280" height="960"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/religion-is-a-way-of-life/article-1061</link>
                <guid>https://www.churakalu.com/telangana/religion-is-a-way-of-life/article-1061</guid>
                <pubDate>Sun, 12 Apr 2026 23:51:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260412-wa0101.jpg"                         length="193144"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల విడుదల </title>
                                    <description><![CDATA[<p>నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.</p>
<p>చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 11 :జగిత్యాల జిల్లా నేరేళ్ల కేంద్రానికి చెందిన ఎంఎల్హెచ్పీ లు ఇటీవలే విడుదలైనా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తా చాటారు. జోన్ 2 బీసీ-సీ కేటగిరీ లో జగిత్యాల జిల్లాకి చెందిన శ్యామ్ బాబు- ఎలిజబెత్ రాణి దంపతుల పెద్ద కుమార్తే  చీలి హరిణి రాష్ట్ర స్థాయిలో 278 ర్యాంక్ సాదించింది. ప్రస్తుతం  జైన(పీహెచ్‌సీ నేరేళ్ల )లో విధులు నిర్వహిస్తుండగా, గాంధీ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. రంగసాగర్ గ్రామానికీ చెంధిన బతుల శ్రుతి (ర్యాంక్ 449)ప్రస్థుతం డోనూరులో విధులు నిర్వాహిస్తు బీసీ-బీలో 2వ ర్యాంక్ సాదించింది. వేణుగుమట్ల గ్రామానికీ చెందింది అనగందుల నరేష్ (905వ ర్యాంకు) బీసీ-బీ లో 6వా ర్యాంక్ ,ప్రస్తుతం బుగ్గరంలో విధులు నిర్వహిస్తుండగా, వీళ్లు ముగ్గురు ఒకే పీహెచ్‌సీకి చెందిన వారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0161.jpg" alt="IMG-20260411-WA0161" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/release-of-nursing-officer-results/article-1060"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260411-wa0094.jpg" alt=""></a><br /><p>నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.</p>
<p>చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 11 :జగిత్యాల జిల్లా నేరేళ్ల కేంద్రానికి చెందిన ఎంఎల్హెచ్పీ లు ఇటీవలే విడుదలైనా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తా చాటారు. జోన్ 2 బీసీ-సీ కేటగిరీ లో జగిత్యాల జిల్లాకి చెందిన శ్యామ్ బాబు- ఎలిజబెత్ రాణి దంపతుల పెద్ద కుమార్తే  చీలి హరిణి రాష్ట్ర స్థాయిలో 278 ర్యాంక్ సాదించింది. ప్రస్తుతం  జైన(పీహెచ్‌సీ నేరేళ్ల )లో విధులు నిర్వహిస్తుండగా, గాంధీ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. రంగసాగర్ గ్రామానికీ చెంధిన బతుల శ్రుతి (ర్యాంక్ 449)ప్రస్థుతం డోనూరులో విధులు నిర్వాహిస్తు బీసీ-బీలో 2వ ర్యాంక్ సాదించింది. వేణుగుమట్ల గ్రామానికీ చెందింది అనగందుల నరేష్ (905వ ర్యాంకు) బీసీ-బీ లో 6వా ర్యాంక్ ,ప్రస్తుతం బుగ్గరంలో విధులు నిర్వహిస్తుండగా, వీళ్లు ముగ్గురు ఒకే పీహెచ్‌సీకి చెందిన వారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0161.jpg" alt="IMG-20260411-WA0161" width="3072" height="4096"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/release-of-nursing-officer-results/article-1060</link>
                <guid>https://www.churakalu.com/telangana/release-of-nursing-officer-results/article-1060</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 22:11:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0094.jpg"                         length="925821"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే కేసీఆర్ పదేళ్ల పాలన మెరుగు జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే  కేసీఆర్ పదేళ్ల పాలనే మెరుగు జీవన్ రెడ్డి <img src="https://www.churakalu.com/media/2026-04/img-20260409-wa0034.jpg" alt="IMG-20260409-WA0034" width="1200" height="902" /></p>
<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం – హాట్ కామెంట్స్..</p>
<p>కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనే మెరుగని వ్యాఖ్య..</p>
<p>రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు కేసీఆర్ కృషి గుర్తింపు..</p>
<p>రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు..</p>
<p>గతంలో నష్టపోయిన రైతులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని..</p>
<p>కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందని..</p>
<p>ఉద్యోగులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని..</p>
<p>పెన్షన్లు పెంచకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి..</p>
<p>ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవని విమర్శ..</p>
<p>ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని..</p>
<p>తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని స్పష్టం..</p>
<p>రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజల అభిప్రాయం అన్న వ్యాఖ్య..</p>
<p>బీఆర్ఎస్‌లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/kcrs-ten-year-rule-is-better-than-congresss-two-year-rule-jeevan/article-1056"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260409-wa0034.jpg" alt=""></a><br /><p>కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే  కేసీఆర్ పదేళ్ల పాలనే మెరుగు జీవన్ రెడ్డి <img src="https://www.churakalu.com/media/2026-04/img-20260409-wa0034.jpg" alt="IMG-20260409-WA0034" width="1600" height="902"></img></p>
<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం – హాట్ కామెంట్స్..</p>
<p>కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనే మెరుగని వ్యాఖ్య..</p>
<p>రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు కేసీఆర్ కృషి గుర్తింపు..</p>
<p>రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు..</p>
<p>గతంలో నష్టపోయిన రైతులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని..</p>
<p>కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందని..</p>
<p>ఉద్యోగులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని..</p>
<p>పెన్షన్లు పెంచకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి..</p>
<p>ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవని విమర్శ..</p>
<p>ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని..</p>
<p>తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని స్పష్టం..</p>
<p>రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజల అభిప్రాయం అన్న వ్యాఖ్య..</p>
<p>బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంకేతం..</p>
<p>తుది నిర్ణయం, కార్యాచరణపై కేటీఆర్ నిర్ణయం ఉంటుందని స్పష్టం..</p>
<p>జగిత్యాల రాజకీయాల్లో హీట్ పెరిగింది...!</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/kcrs-ten-year-rule-is-better-than-congresss-two-year-rule-jeevan/article-1056</link>
                <guid>https://www.churakalu.com/telangana/kcrs-ten-year-rule-is-better-than-congresss-two-year-rule-jeevan/article-1056</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 14:39:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260409-wa0034.jpg"                         length="82784"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డిజిటల్ వేదిక పై శరత్ కుమార్ మేధో విలాసం </title>
                                    <description><![CDATA[<p>సంప్రదాయం + సాంకేతికత = అద్భుత అవధానం: డిజిటల్ వేదికపై శరత్ కుమార్ మేధో విలాసం<br />........... ...................................</p>
<p>​ధర్మపురి పాండిత్య వైభవం: అవధాన ప్రక్రియలో నూతన శకం - వొజ్ఝల శరత్ కుమార్ సాహిత్య ప్రస్థానం<br />.........................................</p>
<p>​రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494</p>
<p>..................................</p>
<p>​తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ధర్మపురి క్షేత్రం అనాదిగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ సంపదలకు నిలయంగా భాసిల్లుతోంది. దక్షిణ భారతదేశం లోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం, కేవలం భక్తి పరంపరలకే కాక వేద వేదాంగాలు, శాస్త్రాగమాలు, సాహిత్య కళలకు పుట్టినిల్లుగా నిలిచింది. క్రీస్తుశకం 9వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం విద్యాభ్యాసానికి, విశేష వేదాధ్యయనాలకు కేంద్రంగా విలసిల్లిందనడానికి ఇక్కడి శాసనాధారాలు, స్థానిక వంశావళులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం, వేములవాడ, బాసర వంటి ప్రసిద్ధ క్షేత్రాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/sarath-kumars-intellectual-luxury-on-the-digital-platform/article-1055"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260405-wa0021(1).jpg" alt=""></a><br /><p>సంప్రదాయం + సాంకేతికత = అద్భుత అవధానం: డిజిటల్ వేదికపై శరత్ కుమార్ మేధో విలాసం<br />........... ...................................</p>
<p>​ధర్మపురి పాండిత్య వైభవం: అవధాన ప్రక్రియలో నూతన శకం - వొజ్ఝల శరత్ కుమార్ సాహిత్య ప్రస్థానం<br />.........................................</p>
<p>​రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494</p>
<p>..................................</p>
<p>​తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ధర్మపురి క్షేత్రం అనాదిగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ సంపదలకు నిలయంగా భాసిల్లుతోంది. దక్షిణ భారతదేశం లోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం, కేవలం భక్తి పరంపరలకే కాక వేద వేదాంగాలు, శాస్త్రాగమాలు, సాహిత్య కళలకు పుట్టినిల్లుగా నిలిచింది. క్రీస్తుశకం 9వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం విద్యాభ్యాసానికి, విశేష వేదాధ్యయనాలకు కేంద్రంగా విలసిల్లిందనడానికి ఇక్కడి శాసనాధారాలు, స్థానిక వంశావళులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం, వేములవాడ, బాసర వంటి ప్రసిద్ధ క్షేత్రాల సరసన ధర్మపురిని కూడా చేర్చి, పండితులు దీనిని “త్రిభుజ తపోభూమి”గా అభివర్ణించడం ఈ నేల యొక్క విశిష్టతను చాటిచెబుతోంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువుదీరిన ఈ పుణ్యధామంలో అర్చక సంప్రదాయాలు, యక్షగాన ప్రదర్శనలు, హరికథా కాలక్షేపాలు ఒకదానితో ఒకటి మిళితమై ఒక అద్భుతమైన సాంస్కృతిక సమన్వయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తరతరాలుగా ఇక్కడ కొనసాగుతున్న విద్యా పరంపరలో సంస్కృతం, తెలుగు, ప్రాకృత భాషల్లో నిష్ణాతులైన పండితులు ధర్మపురిని ఒక “విద్యా క్షేత్రం”గా తీర్చిదిద్దారు. కాలక్రమేణా ఆధునిక విద్యా వ్యవస్థలు ప్రవేశించినప్పటికీ, సంప్రదాయ విద్యా మూలాలను, ఆ ప్రాచీన పాండిత్య గరిమను కాపాడుకుంటూ రావడం ఈ క్షేత్రానికున్న ప్రత్యేక గౌరవం. </p>
<p>ఈ మహోన్నత పాండిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఆధునిక కాలంలో ధర్మపురి గడ్డపై ఉద్భవించిన అద్భుత ప్రతిభావంతుడు డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్ తన అనన్య సామాన్యమైన ప్రతిభతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో సమానమైన పట్టు సాధించి “త్రిభాషా కవి”గా గుర్తింపు పొందారు. ప్రాచీన ఛందస్సాహిత్యంపై దృఢమైన పట్టు కలిగి ఉంటూనే, ఆధునిక భావ వ్యక్తీకరణలో తనదైన ముద్ర వేయడం డాక్టర్ శరత్ కుమార్ ప్రత్యేకత. ఆయన రచించిన శతకాలు సాహిత్య లోకంలో విశేష ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను ఒక శక్తివంతమైన కవిగా నిలబెట్టాయి. భక్తి, నైతికత, సామాజిక స్పృహ కలగలిసిన ఆయన కవిత్వం పండిత పామరులను అలరిస్తోంది.</p>
<p>​తెలుగు సాహిత్య ప్రక్రియల్లో అత్యంత కఠినమైనది, మేధోపరమైనది అయిన ‘అవధానం’లో డాక్టర్ శరత్ కుమార్ ప్రవేశించడం ధర్మపురి సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది. శ్రీ నారాయణీ అవధాన వేదిక ద్వారా నిర్వహించబడిన డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్  ప్రథమ అష్టావధానం అటు సంప్రదాయాన్ని, ఇటు ఆధునిక సాంకేతికతను మేళవించి సాహిత్య లోకానికి కొత్త వెలుగును పంచింది. ఈ కార్యక్రమానికి సంచాలకులుగా గణపతి అశోక్ శర్మ వ్యవహరించగా, ముఖ్య అతిథిగా ముద్దు రాజయ్య వ్యవహరించారు. విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి సభా నిర్వహణ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా చేపట్టి కార్యక్రమ జయప్రదానికి తోడ్పడ్డారు. జూమ్ యాప్ వంటి డిజిటల్ మాధ్యమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడిన ఈ అవధానంలో పృచ్ఛకులుగా ఉద్దండ పండితులు పాల్గొని అవధాని మేధస్సుకు పదును పెట్టారు. నిషిద్ధాక్షరిలో మాచవోలు శ్రీధర్ రావు సంధించిన అక్షర అడ్డంకులను శరత్ కుమార్ చాకచక్యంగా అధిగమించగా, దత్తపదిలో చంద్రశేఖర్ శర్మ ఇచ్చిన క్లిష్ట పదాలను ఛందస్సులో ఇముడ్చుతూ అద్భుతమైన పద్య రచన చేశారు. సమస్య పూరణలో ఈమని మల్లికార్జున రావు విసిరిన వైచిత్రిని సమయ స్ఫూర్తితో పూరించి సభికులను మంత్రముగ్ధులను చేశారు. వర్ణనలో పి.యల్. నాగేశ్వర రావు కోరిన అంశాలను అత్యంత రమణీయంగా చిత్రించగా, న్యస్తాక్షరిలో కౌండిన్య నండూరి వేంకటేశ్వర రాజు సూచనల మేరకు అక్షర విన్యాసాన్ని ప్రదర్శించి తన ధారణా శక్తిని చాటుకున్నారు. మాల్యాల సోమేశ్వర రావు  కోరిన ఆశు కవిత్వంలో ధారాశుద్ధిని, విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి  నిర్వహించిన పురాణ పఠనంలో పాండిత్యాన్ని ప్రకటిస్తూ అవధాని సాగించిన ప్రయాణం తొలి సారి అయినా అది అద్వితీయం. వీటన్నింటి మధ్య దుర్గి శ్రవణ్ కుమార శర్మ  అప్రస్తుత ప్రసంగం సభలో హాస్యపు జల్లులు కురిపిస్తూ ఆహ్లాదాన్ని నింపింది.</p>
<p>​ఈ అష్టావధానం కేవలం కవితా శక్తికి మాత్రమే పరిమితం కాకుండా, ఏకకాలంలో అనేక అంశాలపై దృష్టి సారించగలిగే ఏకాగ్రతను, అమోఘమైన ధారణా శక్తిని, సమయస్ఫూర్తిని, శబ్ద నైపుణ్యాన్ని ఆవిష్కరించింది. డిజిటల్ యుగంలో సంప్రదాయ కళలు అంతరించిపోతాయన్న భయాలను పటాపంచలు చేస్తూ, సాంకేతికతను సాహిత్య వ్యాప్తికి ఎలా ఉపయోగించుకోవచ్చో శరత్ కుమార్ నిరూపించారు.</p>
<p>ధర్మపురి పుణ్యక్షేత్ర చరిత్రలో వేద పండితులు, శాస్త్ర కోవిదులు ఎందరో ఉన్నప్పటికీ, ఆధునిక కాలంలో ఈ క్షేత్రం నుండి అవధానిగా ఎదిగిన తొలి వ్యక్తిగా డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించ దగినది. ఈ విజయం స్థానిక యువతకు, విద్యార్థులకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. తెలుగు భాషా సాహిత్యాలకు ప్రాభవం తగ్గుతోందన్న ఆందోళన ఉన్న తరుణంలో, శరత్ కుమార్ వంటి యువకులు అవధాన కళను భుజానికెత్తుకోవడం శుభపరిణామం. ఆయన రచనల్లో కనిపించే సాహిత్య విలువలు, సామాజిక సందేశాలు నేటి తరం యువతకు దిక్సూచిగా మారుతున్నాయి. ప్రాచీన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునిక పోకడలను ఆహ్వానించే ఆయన దృక్పథం సాహిత్య రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. </p>
<p>సంప్రదాయం మరియు ఆధునికతల ఈ అరుదైన సంగమం ధర్మపురి క్షేత్రానికి నూతన శోభను చేకూరుస్తోంది. వేదాల హోరు, గోదావరి జలాల జోరుతో పునీతమైన ఈ నేల, ఇప్పుడు అవధాన పద్యాల హోయలుతో పులకించి పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచ పటంలో నిలబెట్టడానికి సంకల్పం, సాధన ఉంటే సరిపోతుందని ఈ యువ అవధాని నిరూపించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప సాహిత్య విజయాలు సాధించి, తెలుగు భాషా కీర్తిని దశదిశలా వ్యాపింప జేయాలని, ఆయన స్ఫూర్తితో మరిన్ని ప్రతిభావంతమైన మస్తిష్కాలు ధర్మపురి నేల నుండి ఉద్భవించాలని ఆశిద్దాం. పాతను గౌరవిస్తూ కొత్తను ఆహ్వానించే ఈ సాహిత్య ప్రయాణం నిరంతరాయంగా సాగి, తెలుగు సాహిత్య వైభవం కలకాలం వర్ధిల్లాలి.</p>
<p>చంపక మాల...<br />సకల కవిత్వ తత్త్వముల సారము గన్న శరత్ కుమారుడున్, <br />ప్రకటిత డిజిటల్ తెరల పై నవధానము జేసె వింతగా, <br />సుకవిగ ధర్మపురి క్షేత్రము శోభను పెంచెను పద్య విద్దెతో<br />వికసిత కీర్తి తోడ నిక విశ్వము మెచ్చగ సాగు నెప్పుడున్!<br />......................<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260405-wa0020.jpg" alt="IMG-20260405-WA0020" width="853" height="1206"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/sarath-kumars-intellectual-luxury-on-the-digital-platform/article-1055</link>
                <guid>https://www.churakalu.com/telangana/sarath-kumars-intellectual-luxury-on-the-digital-platform/article-1055</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 13:17:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260405-wa0021%281%29.jpg"                         length="546363"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లా గ్రంధాలయ సంస్థ చేర్మెన్ గా దీనిష్ </title>
                                    <description><![CDATA[<p>మూడు దశాబ్దాల నిబద్ధతకు ప్రతిఫలం – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ నియామకం<br />...................</p>
<p>రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్ <br />........</p>
<p>జిల్లా రాజకీయాల్లో మౌనంగా పనిచేసే, కానీ ప్రభావవంతమైన నాయకత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగన భట్ల దినేష్‌ నియామకం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జరగడం ఒక విధంగా ప్రజాసేవకు ఆయన చేసిన దీర్ఘకాల కృషికి లభించిన గౌరవంగా భావించవచ్చు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, క్రమంగా ప్రజా సమస్యలపై పట్టుదలతో ముందుకు సాగుతూ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. గ్రామస్థాయి నాయకత్వం నుంచి జిల్లా స్థాయి బాధ్యతల వరకు ఎదిగిన ఆయన ప్రయాణం, నేటి యువ నాయకులకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.</p>
<p>ప్రస్తుతం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగన భట్ల దినేష్‌, పార్టీ వ్యవస్థలో క్రమశిక్షణ, నిబద్ధత, సమన్వయం అనే విలువలను ప్రతిష్ఠాత్మకంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/idish-as-the-chairman-of-the-district-library-organization/article-1054"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260328-wa0100.jpg" alt=""></a><br /><p>మూడు దశాబ్దాల నిబద్ధతకు ప్రతిఫలం – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ నియామకం<br />...................</p>
<p>రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్ <br />........</p>
<p>జిల్లా రాజకీయాల్లో మౌనంగా పనిచేసే, కానీ ప్రభావవంతమైన నాయకత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగన భట్ల దినేష్‌ నియామకం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జరగడం ఒక విధంగా ప్రజాసేవకు ఆయన చేసిన దీర్ఘకాల కృషికి లభించిన గౌరవంగా భావించవచ్చు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, క్రమంగా ప్రజా సమస్యలపై పట్టుదలతో ముందుకు సాగుతూ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. గ్రామస్థాయి నాయకత్వం నుంచి జిల్లా స్థాయి బాధ్యతల వరకు ఎదిగిన ఆయన ప్రయాణం, నేటి యువ నాయకులకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.</p>
<p>ప్రస్తుతం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగన భట్ల దినేష్‌, పార్టీ వ్యవస్థలో క్రమశిక్షణ, నిబద్ధత, సమన్వయం అనే విలువలను ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగాయి. పార్టీ సిద్ధాంతాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తూ, వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఆయన ప్రత్యేక లక్షణం.<br />గతంలో ధర్మపురి ఎంపీటీసీగా పనిచేసిన సమయంలోనే ఆయన ప్రజా సమస్యలపై లోతైన అవగాహనను పెంపొందించు కున్నారు. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, స్థానిక ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఎంపీటీసీగా ఉన్నప్పుడే ఆయన ప్రజల మధ్య విశ్వసనీయ నాయకుడిగా ఎదిగారు.</p>
<p>దివంగత మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు  అనుచరుడిగా సంగన భట్ల దినేష్‌  రాజకీయంగా మరింత పరిపక్వత సాధించారు. రత్నాకర్ రావు సాన్నిధ్యంలో ఆయన రాజకీయ దిశ, దృక్పథం మరింత బలపడింది. నాయకత్వం అంటే కేవలం అధికారంలో ఉండటం కాదు, ప్రజలకు సేవ చేయడం అనే భావనను ఆయన గురువు ద్వారా నేర్చుకున్నారు. అదే మార్గంలో నడుస్తూ, తన రాజకీయ జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు.</p>
<p>ధర్మపురి దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన చూపిన పరిపాలనా నైపుణ్యం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. దేవస్థాన అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు భక్తుల ప్రశంసలను అందుకున్నాయి. ఆలయ పరిసరాల అభివృద్ధి, సదుపాయాల విస్తరణ, పారదర్శక పరిపాలన వంటి అంశాల్లో ఆయన చేసిన కృషి స్పష్టంగా కనిపించింది. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంలో ఆయన చూపిన కట్టుబాటు, ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.</p>
<p>మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని వీడకుండానే కొనసాగుతున్న ఆయన రాజకీయ ప్రయాణం, నేటి రాజకీయ పరిస్థితుల్లో అరుదైన ఉదాహరణగా చెప్పవచ్చు. అనేక ఒడిదుడుకులు, మార్పులు వచ్చినప్పటికీ పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సేవను ప్రాధాన్యంగా తీసుకున్న నాయకుడిగా ఆయన నిలిచారు. ఈ స్థిరత్వమే ఆయనకు పార్టీ నాయకత్వం నుంచి విశ్వాసాన్ని తీసుకువచ్చింది.<br />సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అత్యంత సన్నిహితులైన దినేష్, ఆయన<br />చొరవతో సంగన భట్ల దినేష్‌ ను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమించడం, ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన నిర్ణయంగా భావించవచ్చు. ఈ బాధ్యత ఆయనకు ఒక సవాలుగా కూడా నిలుస్తోంది. గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులలో చదువుపట్ల ఆసక్తి పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో జ్ఞాన వనరులను విస్తరించడం వంటి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది.</p>
<p>ప్రస్తుతం సమాజంలో పుస్తక పఠనం తగ్గిపోతున్న నేపథ్యంలో, గ్రంథాలయాల ప్రాముఖ్యతను తిరిగి ప్రజలకు తెలియజేయడం అత్యవసరం. ఈ దిశగా సంగన భట్ల దినేష్‌ చేపట్టబోయే కార్యక్రమాలు కీలకంగా మారనున్నాయి. డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రంథాలయాలను ఆధునీకరించడం, యువతను ఆకర్షించే విధంగా పుస్తకాల ఎంపిక, పఠన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో ఆయన వినూత్న ఆలోచనలు అమలు చేస్తారని ఆశించవచ్చు.</p>
<p>జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించడం ద్వారా, విద్యా రంగానికి ఆయన అందించే సేవలు మరింత విస్తరించే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల కొరతను తీర్చడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్ని గుర్తించి, ప్రతి గ్రామానికి గ్రంథాలయ సౌకర్యాన్ని చేరువ చేయడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యంగా నిలవాలి.</p>
<p>సంగన భట్ల దినేష్‌ వ్యక్తిత్వంలో కనిపించే వినయం, కృషి, ప్రజల పట్ల ప్రేమ, పార్టీ పట్ల నిబద్ధత—కలగలిపి ఆయనను ఆదర్శ నేతగా నిలబెట్టాయి. ఆయన రాజకీయ జీవితం కేవలం పదవుల కోసం కాకుండా, ప్రజా సేవ కోసం సాగుతున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లక్షణాల వల్లే ఆయనకు జిల్లా స్థాయిలో ఈ కీలక బాధ్యత లభించింది.</p>
<p>మొత్తంగా చూస్తే, సంగన భట్ల దినేష్‌ గారి నియామకం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జరగడం ఒక వ్యక్తిగత విజయమే కాకుండా, ప్రజాసేవకు ఆయన చేసిన నిరంతర కృషికి లభించిన గుర్తింపుగా భావించాలి. భవిష్యత్తులో ఆయన ఈ బాధ్యతను సద్వినియోగం చేసుకుని, జిల్లా విద్యా అభివృద్ధికి, జ్ఞాన విస్తరణకు కీలక పాత్ర పోషిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260328-wa0100.jpg" alt="IMG-20260328-WA0100" width="810" height="1280"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/idish-as-the-chairman-of-the-district-library-organization/article-1054</link>
                <guid>https://www.churakalu.com/telangana/idish-as-the-chairman-of-the-district-library-organization/article-1054</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 21:07:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260328-wa0100.jpg"                         length="102713"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>40 ఏళ్ల హస్త బంధం.... గులాబీ లో కొత్త ఆశ!</title>
                                    <description><![CDATA[<p>40 ఏళ్ల హస్త బంధం.. గులాబీలో కొత్త ఆశ!</p>
<p>ప్రజల కోసం జీవన్ రెడ్డి మరో పోరాటం మొదలు!</p>
<p>(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)</p>
<p>జగిత్యాల రాజకీయ గగనంలో మరోసారి మెరుపు మెరుస్తోంది. ఒక నాయకుడి నిర్ణయం, వేలాది మంది కార్యకర్తల భావోద్వేగం, లక్షలాది మంది ప్రజల ఆశలు.. అన్నీ ఒక్క క్షణంలో కలిసిన అపూర్వ ఘట్టం! ఈ నెల 25న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తన కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించి, తన రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది సాధారణ సమావేశం కాదు.. ఒక యుగానికి ముగింపు, మరో కొత్త యుగానికి ఆరంభం! 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు అంకితభావంతో సేవ చేసిన జీవన్ రెడ్డి… ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత లాభం లేదు. అది ఒక ఆత్మగౌరవ పోరాటం! తనతో నడిచిన కార్యకర్తల గౌరవం కోసం… తనను నమ్ముకున్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/40-years-of-hasta-bandham-is-a-new-hope-in/article-1049"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260322-wa0061.jpg" alt=""></a><br /><p>40 ఏళ్ల హస్త బంధం.. గులాబీలో కొత్త ఆశ!</p>
<p>ప్రజల కోసం జీవన్ రెడ్డి మరో పోరాటం మొదలు!</p>
<p>(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)</p>
<p>జగిత్యాల రాజకీయ గగనంలో మరోసారి మెరుపు మెరుస్తోంది. ఒక నాయకుడి నిర్ణయం, వేలాది మంది కార్యకర్తల భావోద్వేగం, లక్షలాది మంది ప్రజల ఆశలు.. అన్నీ ఒక్క క్షణంలో కలిసిన అపూర్వ ఘట్టం! ఈ నెల 25న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తన కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించి, తన రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది సాధారణ సమావేశం కాదు.. ఒక యుగానికి ముగింపు, మరో కొత్త యుగానికి ఆరంభం! 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు అంకితభావంతో సేవ చేసిన జీవన్ రెడ్డి… ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత లాభం లేదు. అది ఒక ఆత్మగౌరవ పోరాటం! తనతో నడిచిన కార్యకర్తల గౌరవం కోసం… తనను నమ్ముకున్న ప్రజల భవిష్యత్తు కోసం… ఒంటరిగా భరించిన అవమానాలను కూడా గౌరవంగా మలచుకున్న ధైర్యవంతుడి ప్రకటన! ఆయన కళ్లలో కనిపించే ఆవేదన, కార్యకర్తల ముఖాల్లో కనిపించే నమ్మకం… ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఇది ఒక తండ్రి తన కుటుంబం కోసం చేసే త్యాగం!</p>
<p>రైతు ఇంటి బిడ్డ నుంచి ప్రజల హృదయాలలో స్థానం వరకు…</p>
<p>1951 జనవరి 5న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికే పెళ్లి గ్రామం లో జన్మించిన జీవన్ రెడ్డి… ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా.. అసాధారణమైన ప్రజా నాయకుడిగా ఎదిగారు. విద్యలో ప్రతిభ చూపి న్యాయవాదిగా మారినా… ప్రజల కోసం పోరాడాలనే సంకల్పం ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా మొదలైన ఈ ప్రయాణం… 1983లో ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఎదిగే స్థాయికి చేరింది. అసమ్మతులు వచ్చినా సిద్ధాంతాలకు తలొగ్గని వ్యక్తిత్వం ఆయనది. 1984లో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత… 40 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గకుండా పార్టీకి సేవ చేసిన అరుదైన నేతగా నిలిచారు.</p>
<p>గెలుపు–ఓటములు కాదు… సేవే ఆయనకు ప్రమాణం!</p>
<p>1989 నుంచి 2004 వరకు పలు మార్లు ఎమ్మెల్యేగా విజయం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి బాధ్యతలు…<br />తెలంగాణ ఉద్యమంలో నిబద్ధత…<br />2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఉత్తర తెలంగాణలో గౌరవం నిలబెట్టిన నాయకుడు…<br />ఓటములు వచ్చినా వెనుకడుగు వేయని ధైర్యం, గెలిచినా అహంకారం రాని వినయం.. ఇవి జీవన్ రెడ్డి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. జగిత్యాల ప్రజలు ప్రేమగా పిలిచే “జీవనన్న”… కేవలం నాయకుడు కాదు.. ఒక కుటుంబ సభ్యుడు!</p>
<p>అవమానాల మధ్య కూడా విలువలను వదలని నాయకుడు…</p>
<p>తనను ఎదిగించిన పార్టీ నుంచే తన వర్గానికి జరిగిన అన్యాయం… పదవుల పంపకాల్లో స్పష్టమైన వివక్ష… కార్యకర్తల మనోభావాలకు గాయం… ఇవన్నీ ఆయనను లోలోపల కలిచివేశాయి. కానీ ఆయన తొందరపడలేదు… పోరాడారు… ప్రశ్నించారు… ఎదిరించారు. చివరికి తన గౌరవం, తన కార్యకర్తల గౌరవం కాపాడుకునే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజకీయ మార్పు కాదు… ఇది ఒక విలువల ప్రకటన!</p>
<p>కార్యకర్తల సమావేశంలో కొత్త దిశ… ప్రజల కోసం కొత్త పోరాటం!</p>
<p>ఈ నెల 25న జరగబోయే కార్యకర్తల భారీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయం ద్వారా… జీవన్ రెడ్డి తన అనుభవం, తన ప్రజా బలం, తన కట్టుబాటు.. ఇప్పటి నుంచి ఇవన్నీ కొత్త రాజకీయ దిశకు సేవ చేయబోతున్నాయి! జగిత్యాలలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభం కానున్నాయి. ఆయనతో పాటు వేలాది కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ ప్రయాణంలో భాగమవుతున్నారు. ఇది ఆయన ఒంటరి ప్రయాణం కాదు… ఇది జగిత్యాల ప్రజలందరి ప్రయాణం!</p>
<p>ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడికి కొత్త అధ్యాయం…</p>
<p>జీవన్ రెడ్డి రాజకీయ జీవితం ఒక పుస్తకం అయితే… ప్రతి అధ్యాయం ప్రజల కోసం రాసిందే! టీడీపీ నుంచి కాంగ్రెస్… ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ… ఇప్పుడు కొత్త దిశ వరకు.. అన్ని మార్పుల మధ్య ఆయన మారని విషయం ఒక్కటే.. ప్రజల పట్ల ఆయన నిబద్ధత! మార్చి 25న జరగబోయే ఈ కార్యకర్తల సమావేశం… కేవలం ఒక సమావేశం కాదు.. ఒక భావోద్వేగం! జీవన్ రెడ్డి అడుగులు ఎక్కడ పడితే అక్కడ మార్పు తప్పనిసరి… ఆయన నిలిచిన చోట ప్రజల గళం వినిపిస్తుంది. ఇప్పుడు ఆ గళం మరింత గట్టిగా, మరింత ధైర్యంగా వినిపించబోతోందా? జగిత్యాల మరోసారి “జీవనన్న” నాయకత్వంలో కొత్త చరిత్రను సృష్టించబోతుందా? మార్చి 25… కేవలం ఒక తేదీ కాదు.. ఒక భావోద్వేగం!<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260322-wa0061.jpg" alt="IMG-20260322-WA0061" width="791" height="1188"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/40-years-of-hasta-bandham-is-a-new-hope-in/article-1049</link>
                <guid>https://www.churakalu.com/telangana/40-years-of-hasta-bandham-is-a-new-hope-in/article-1049</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 17:24:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260322-wa0061.jpg"                         length="67483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పార్టీ లో కొనసాగే పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు..</p>
<p>25 న అభిమానులు..శ్రేయోభిలాషులతో సమావేశం.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ..</p>
<p>నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే.</p>
<p>శాసన మండలి లో ఒంటరి పోరాటం చేసిన..<br />అధికారం లో ఉన్న ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన..</p>
<p>తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం జాప్యం తో తెలంగాణ రాష్ట్రం పై తీవ్ర ప్రభావం..</p>
<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి..</p>
<p>జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.</p>
<p>20 మాసాల  నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి.</p>
<p>నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగటం సాధ్యం కాదు అని అభిప్రాయానికి వచాను..</p>
<p>నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవ బాధాకరం..</p>
<p>అది నుండి ప్రజల పక్షం నిలబడి<br />అధికార</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/jeevan-reddy-has-no-condition-to-continue-in-the-congress/article-1048"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260322-wa0053.jpg" alt=""></a><br /><p>కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు..</p>
<p>25 న అభిమానులు..శ్రేయోభిలాషులతో సమావేశం.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ..</p>
<p>నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే.</p>
<p>శాసన మండలి లో ఒంటరి పోరాటం చేసిన..<br />అధికారం లో ఉన్న ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన..</p>
<p>తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం జాప్యం తో తెలంగాణ రాష్ట్రం పై తీవ్ర ప్రభావం..</p>
<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి..</p>
<p>జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.</p>
<p>20 మాసాల  నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి.</p>
<p>నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగటం సాధ్యం కాదు అని అభిప్రాయానికి వచాను..</p>
<p>నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవ బాధాకరం..</p>
<p>అది నుండి ప్రజల పక్షం నిలబడి<br />అధికార పార్టీ లో ఉండి  కూడా పోరాటం చేసిన.</p>
<p>ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేకర్ రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా రూ.5000<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260322-wa0056.jpg" alt="IMG-20260322-WA0056" width="4096" height="3072"></img> చెల్లిస్తామని హమీ ఇచి, జగిత్యాలలో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహకం అందించాలని మంత్రి గా ఉండి కూడా ధర్నా చేసిన అని గుర్తు చేసిన.</p>
<p>ఎలెక్ట్రిసిటీ అదనపు బిల్లు ఉపసంహరించాలని ఎమ్మెల్సీగా ఉండి కూడా ఉద్యమించిన.</p>
<p>నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో<br />శ్రీధర్ బాబుతో అనుబంధం తో మాట్లాడారు.</p>
<p>నా సమస్యకు ఎవరి వద్ద పరిష్కారం లేదు..</p>
<p>పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచించాను.</p>
<p>ప్రతిపక్ష పార్టీ గా దశాబ్ద కాలంగా పని చేసి, అధికారం వచ్చిన తర్వాత మా హక్కులు కాలారాస్తుంటే ఎంతకాలం భరించాలి.</p>
<p>కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు దారులు పార్టీ నీ నడిపిస్తున్నారు.</p>
<p>రాజకీయమే గౌరవం కోసం.. ఆ గౌరవం లేకపోవడంతో పార్టీ లో కొనసాగటం వల్ల ప్రయోజనం ఏమిటి..</p>
<p>నా పరిస్థితి వివరించిన తర్వాత శ్రీధర్ బాబు కూడా సమాధానం చెప్పలేకపోయారు.</p>
<p>జగిత్యాలలో కాంగ్రెసు ను ఐక్యంగా నిలపడానికి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు అండగా నిలవడంతో ఈ స్థాయిలో ఎదిగిన.</p>
<p>టీడీపీ పాలనలో సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.</p>
<p>2014 లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాం.</p>
<p>ఓడిన ఎన్నడూ నాకు ఓటమి అనే భావన రాకుండా..కార్యకర్తలు.. అభిమానులు.. </p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేసిన.</p>
<p>నాలో అసహనం పెరుగుతుంది..</p>
<p>ప్రత్యర్థి పై పోరాటం చేయటం...సహజం కానీ<br />సొంత పార్టీ పై పోరాటం చేయటం ఎంత బాధాకరం..</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో నేను ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు వచ్చిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయిన..</p>
<p>కాంగ్రెస్ లో కొనసాగటం సరి కాదని, వైదొలగాలని అభిప్రాయానికి వచ్చిన.</p>
<p>25 న స్థానిక బండారి గార్డెన్ లో రాజకీయ సహచరులు, అభిమానులు, శ్రేయోభిలాశులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం..</p>
<p> రాష్ట్ర నాయకత్వం అధిష్టానం పై నెట్టివేస్తున్నారు.</p>
<p>నాకు అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే పాత్ర సైతం ఉంది..</p>
<p>తెలంగాణకు ఆధారం ప్రాణహిత నది.</p>
<p>ప్రాణహిత నీరు వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలని తుమ్మడి హేట్టి వద్ద నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.</p>
<p>ఆదిలాబాద్ నుండి రంగారెడ్డి వరకు త్రాగు నీరు, సాగు నీరు పారిశ్రామిక అవసరాలకు ఆధారం ప్రాణహిత..</p>
<p>తుమ్మడి హేట్టి జాప్యం తో ఉత్తర తెలంగాణ కరువు తలెత్గే ప్రమాదం ఉంది.</p>
<p>ఇంత వరకు మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టడం లేదు..</p>
<p>కాంట్రాక్టర్ మరమాతు పనులు చేపట్టకపోతే ప్రభుత్వమే చేపట్టి, కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు..</p>
<p>తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం ఎన్నికల్లో మేనిఫెస్టో లో పేర్కొన్నారు.</p>
<p>ప్రజాహిత అంశాలు విస్మరించడం ఎంత వరకు సమంజసం.</p>
<p>రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పై ప్రభావం చూపుతుంది.</p>
<p>మంత్రిగా నాకు అర్హత ఉంది .<br />.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా..మండలి లో ఒంటరి పోరు చేసిన..</p>
<p> రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్క లా నేను నా స్థాయిలో పోరాటం చేసిన.<br />నా సంయమనానికి పరిమితి ఉండదా..</p>
<p>ప్రజాస్వామ్యంలో నా స్వేచకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్న.. <br />25 నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం..</p>
<p>జగిత్యాల తో నా అనుబంధం ఎవరు తెంచలేరు.. నా చివరి శ్వాస వరకు జగిత్యాల తో అనుబంధం కొనసాగుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/jeevan-reddy-has-no-condition-to-continue-in-the-congress/article-1048</link>
                <guid>https://www.churakalu.com/telangana/jeevan-reddy-has-no-condition-to-continue-in-the-congress/article-1048</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 17:16:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260322-wa0053.jpg"                         length="165839"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫలించని దౌత్యం..... పట్టు వీడని జీవన్ </title>
                                    <description><![CDATA[<p>ఫలించని దౌత్యం... పట్టు వీడని జీవన్ రెడ్డి...<br />.................................<br />జగిత్యాలలో హైడ్రామా… మంత్రుల బుజ్జగింపులకు నో చెప్పిన జీవన్<br />.............................................</p>
<p>సీనియర్ నేత అసంతృప్తి… కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభానికి సంకేతం<br />.......   ............................</p>
<p>రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494<br />... ............................... <br />తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశాలలో కరీంనగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కురువృద్ధుడు తాడిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ నిర్ణయం ఒకటి. దాదాపు నాలుగు దశాబ్దాలకు  పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించిన ఈ సీనియర్ నాయకుడు పార్టీని వీడే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక నాయకుడు తన రాజకీయ జీవితమంతా అంకితం చేసిన పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకోవడం సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, పార్టీ అంతర్గత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/jeevan-that-fruitless-diplomacy-will-not-let-go/article-1047"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260311-wa0090.jpg" alt=""></a><br /><p>ఫలించని దౌత్యం... పట్టు వీడని జీవన్ రెడ్డి...<br />.................................<br />జగిత్యాలలో హైడ్రామా… మంత్రుల బుజ్జగింపులకు నో చెప్పిన జీవన్<br />.............................................</p>
<p>సీనియర్ నేత అసంతృప్తి… కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభానికి సంకేతం<br />.......   ............................</p>
<p>రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494<br />... ............................... <br />తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశాలలో కరీంనగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కురువృద్ధుడు తాడిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ నిర్ణయం ఒకటి. దాదాపు నాలుగు దశాబ్దాలకు  పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించిన ఈ సీనియర్ నాయకుడు పార్టీని వీడే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక నాయకుడు తన రాజకీయ జీవితమంతా అంకితం చేసిన పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకోవడం సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, పార్టీ అంతర్గత పరిణామాలు, నాయకత్వ వ్యవహార శైలి, స్థానిక రాజకీయ సమీకరణాలు వంటి అంశాలు విశ్లేషణకు గురవుతున్నాయి.<br />జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉంది. గ్రామీణ స్థాయి కార్యకర్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, జిల్లా స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగింది. పార్టీకి కష్టకాలంలో కూడా ఆయన వెన్నుదన్నుగా నిలిచిన సందర్భాలు అనేకం. అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. అయితే, ఇటీవలి కాలంలో పార్టీ అంతర్గత రాజకీయాలు, కొత్త నాయకత్వ ప్రాధాన్యం, వర్గపోరాటాలు వంటి అంశాలు ఆయనను నిరుత్సాహానికి గురిచేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.<br />ఈ నేపథ్యంలో శనివారం జరిగిన రాజకీయ పరిణామాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశం వెనుక ప్రధాన ఉద్దేశ్యం జీవన్ రెడ్డిని పార్టీ నుంచి వెళ్లకుండా ఆపడం, ఆయన అసంతృప్తిని తగ్గించడం, భవిష్యత్తులో తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడం అని స్పష్టమైంది.<br />అయితే, ఈ దౌత్య ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయని సమాచారం. జీవన్ రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభించలేదనే భావనను స్పష్టంగా వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్మాణంలో తన పాత్రను విస్మరించారని, కొత్తగా వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి పాతవారిని పక్కన పెట్టే ధోరణి పెరిగిందని ఆయన అభిప్రాయపడినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్థానిక స్థాయిలో నిర్ణయాల విషయంలో తనను సంప్రదించకపోవడం, కీలక పదవుల కేటాయింపులో తన అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఆయన అసంతృప్తికి కారణమయ్యాయని తెలుస్తోంది.<br />తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత, నాయకత్వ నిర్మాణంలో వచ్చిన మార్పులు కూడా ఈ సంక్షోభానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ అంతర్గత సమీకరణాలు మారిపోవడం సహజం. కానీ, ఆ మార్పులు సీనియర్ నాయకులను దూరం చేసే విధంగా ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవన్ రెడ్డి వంటి నాయకులు పార్టీకి మూలస్తంభాలుగా పనిచేసిన వారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేయడం పార్టీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.<br />ఇంకా ఒక ముఖ్యమైన అంశం స్థానిక రాజకీయ సమీకరణాలు. కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడు తన రాజకీయ భవిష్యత్తును పునఃపరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవన్ రెడ్డి కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు ఉన్న వ్యక్తిగత ప్రాభవం, అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఇతర పార్టీలు కూడా ఆయనను ఆహ్వానించడానికి ఆసక్తి చూపుతున్నాయి.<br />ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏదన్నది. ఆయన భారాసలో చేరుతారా? లేక భాజపాలో చేరుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. భారాసలో చేరితే ప్రాంతీయ రాజకీయాల్లో ఆయనకు తక్షణ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. మరోవైపు భాజపాలో చేరితే జాతీయ స్థాయిలో తన రాజకీయ పరిధిని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు పార్టీలకు కూడా ఆయన అనుభవం, ప్రజా మద్దతు ఉపయోగపడే అవకాశముంది.<br />జీవన్ రెడ్డి నిర్ణయం కేవలం ఒక నాయకుడి వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై ఒక ప్రతిబింబంగా కూడా చూడవచ్చు. సీనియర్ నాయకులను గౌరవించడం, వారి అనుభవాన్ని వినియోగించుకోవడం, యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం—ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత అవసరం. ఈ సమతుల్యత కోల్పోతే ఇలాంటి పరిణామాలు సహజమే.<br />ఈ సంఘటన మరో ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెస్తోంది—పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతవరకు అమలవుతోంది? నిర్ణయ ప్రక్రియలో అన్ని స్థాయిల నాయకులకు అవకాశాలు కల్పిస్తున్నారా? లేక కొంతమంది చేతుల్లోనే అధికార కేంద్రీకరణ జరుగుతోందా? జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతోంది.<br />ఇక దౌత్య పరంగా చూస్తే, మంత్రులు స్వయంగా వెళ్లి చర్చలు జరపడం పార్టీ నాయకత్వం సమస్యను సీరియస్‌గా తీసుకున్నట్లు సూచిస్తుంది. కానీ, ఆ చర్చలు ఫలించకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదు, లోతైన వ్యవస్థాత్మక సమస్యల సూచనగా కూడా భావించవచ్చు.</p>
<p>మొత్తం మీద జీవన్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తీసుకురావచ్చు. ఆయన ఏ పార్టీని ఎంచుకుంటారన్నది మాత్రమే కాకుండా, ఆయన నిర్ణయం ఇతర నాయకులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక హెచ్చరిక సంకేతంగా కూడా భావించవచ్చు. పార్టీని బలోపేతం చేయాలంటే అంతర్గత విభేదాలను సకాలంలో పరిష్కరించుకోవడం, సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడం, సమన్వయంతో ముందుకు సాగడం అత్యవసరం.</p>
<p>జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను కూడా ప్రభావితం చేయగలదు. అందువల్ల ఈ పరిణామాలను రాజకీయ వర్గాలు మాత్రమే కాకుండా, ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయ దిశను కొంతమేరకు నిర్దేశించే అవకాశముంది.<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260311-wa0091.jpg" alt="IMG-20260311-WA0091" width="1500" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/jeevan-that-fruitless-diplomacy-will-not-let-go/article-1047</link>
                <guid>https://www.churakalu.com/telangana/jeevan-that-fruitless-diplomacy-will-not-let-go/article-1047</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 11:30:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260311-wa0090.jpg"                         length="44748"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల లో రాజకీయ భూకంపం, బీ ఆర్ ఎస్ లోకి జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>*జగిత్యాల లో రాజకీయ భూకంపం* </p>
<p>*మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి?* </p>
<p>*కాంగ్రెస్‌కు గుడ్‌బై సంకేతాలు* </p>
<p>*ఈనెల 25న కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో చేరిక* </p>
<p>  <br />( *కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్* )</p>
<p>జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన మాజీ మంత్రి, సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరగబోతుందనే చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. వచ్చే మార్చి 25న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.<br />ఈ వార్త ఒక్కటే జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మార్పు, కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/jeevan-reddy-joins-brs-as-a-political-earthquake-in-jagittala/article-1046"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260316-wa0102.jpg" alt=""></a><br /><p>*జగిత్యాల లో రాజకీయ భూకంపం* </p>
<p>*మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి?* </p>
<p>*కాంగ్రెస్‌కు గుడ్‌బై సంకేతాలు* </p>
<p>*ఈనెల 25న కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో చేరిక* </p>
<p> <br />( *కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్* )</p>
<p>జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన మాజీ మంత్రి, సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరగబోతుందనే చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. వచ్చే మార్చి 25న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.<br />ఈ వార్త ఒక్కటే జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మార్పు, కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత విభేదాలు… ఇవన్నీ ఇప్పుడు జీవన్ రెడ్డి నిర్ణయానికి కారణాలుగా చర్చకు వస్తున్నాయి.</p>
<p>*సంజయ్ కుమార్ ఫిరాయింపుతో మొదలైన రాజకీయ ఉద్రిక్తత* </p>
<p>2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ పరిణామం కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. జగిత్యాలలో ఇప్పటికే బలమైన స్థాయిలో ఉన్న మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి వర్గానికి ఇది పెద్ద దెబ్బగా మారింది. సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పార్టీ అధిష్టానం అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. టిక్కెట్లు, స్థానిక సంస్థల పదవులు, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత… అన్నింటిలోనూ సంజయ్ కుమార్ వర్గానికే ఆధిక్యం లభించిందనే భావన జీవన్ రెడ్డి అనుచరుల్లో బలంగా వ్యక్తమైంది. ఇది క్రమంగా రాజకీయ విభేదాలకు దారి తీసింది.</p>
<p>*మున్సిపల్ ఎన్నికలు… అసంతృప్తికి చివరి అంకం* </p>
<p>ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఈ అసంతృప్తిని మరింత బహిర్గతం చేశాయి. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్‌లో టిక్కెట్ల కేటాయింపులో సంజయ్ కుమార్ వర్గానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ఇదే కాకుండా చైర్‌పర్సన్ పదవి కూడా సంజయ్ కుమార్ వర్గానికి వెళ్లడం జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా సేవలు అందించిన నేతకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం అనుచరులను కలచివేసింది.<br />ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పలుమార్లు పార్టీ హైకమాండ్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సమస్యకు సరైన పరిష్కారం లభించకపోవడంతో ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచన ప్రారంభించినట్లు తెలుస్తోంది.</p>
<p>*బీఆర్ఎస్‌తో చర్చలు… గులాబీ కండువా సంకేతాలు* </p>
<p>రాజకీయ వర్గాల్లో వస్తున్న సమాచారం ప్రకారం జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశాలు తరువాత ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కూడా చర్చలు జరిగాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వచ్చే మార్చి 25న జగిత్యాల పట్టణంలోని బండారి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో భారీ సభ ఏర్పాటు చేసి, కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరిక జరగనున్నట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు.</p>
<p>*సోషల్ మీడియాలో స్పష్టమైన సంకేతాలు* </p>
<p>జీవన్ రెడ్డి అనుచరులు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చడం, గులాబీ రంగు పోస్టర్లు పెట్టడం వంటి చర్యలు ప్రారంభించారు. ఇది పార్టీ మార్పుకు స్పష్టమైన సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువ కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాలు, గులాబీ కండువాలతో ప్రచారం ప్రారంభించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది.</p>
<p>*న్యూస్ ఛానల్స్‌లో కూడా ఇదే చర్చ* </p>
<p>ఈ పరిణామం ఇప్పటికే పలు టెలివిజన్ ఛానల్స్ మరియు యూట్యూబ్ మీడియాల్లో ప్రధాన చర్చగా మారింది. పలు తెలుగు టీవీ చానల్స్ ఇటీవల ప్రసారం చేసిన బ్రేకింగ్ న్యూస్‌లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని వీడియోల్లో “కేసీఆర్ హామీతో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోబోతున్నారు” అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.</p>
<p>*నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ ప్రయాణం* </p>
<p>టీ. జీవన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జిల్లా రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు.<br />వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో బలమైన క్యాడర్, వ్యక్తిగత అనుబంధం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే శైలి… ఇవన్నీ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.<br />జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు ఇప్పటికీ బలమైన రాజకీయ ఆధారం ఉంది.</p>
<p>*బీఆర్ఎస్‌కు కొత్త బలం?* </p>
<p>జీవన్ రెడ్డి నిజంగా బీఆర్ఎస్‌లో చేరితే ఉత్తర తెలంగాణలో ఆ పార్టీకి కొత్త బలం లభించే అవకాశం ఉంది. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వంటి ప్రాంతాల్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్తి నాయకులు కూడా ఈ పరిణామం తర్వాత తమ భవిష్యత్‌పై ఆలోచించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.</p>
<p>*కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ?* </p>
<p>మరోవైపు ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు. ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత అసంతృప్తి బహిర్గతం కావడం పార్టీ అంతర్గత పరిస్థితులను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకుల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.</p>
<p>*తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు* </p>
<p>తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పార్టీ మార్పులు, ఫిరాయింపులు, అసంతృప్తి రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిర్ణయం మరో కీలక మలుపుగా మారవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ సమక్షంలో జరిగే ఈ చేరిక భారీ రాజకీయ సందేశాన్ని పంపే అవకాశం ఉంది.<br />జగిత్యాల నుంచి ప్రారంభమయ్యే ఈ రాజకీయ పరిణామం తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు సమాధానం వచ్చే రోజుల్లో తెలుస్తుంది. మార్చి 25న జగిత్యాలలో జరిగే సభ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ హాజరైతే ఈ చేరిక మరింత భారీగా జరిగి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయడం ఖాయం. తెలంగాణ రాజకీయ రంగస్థలం మరోసారి ‘గులాబీ’ రంగులో మునిగిపోతుందా? లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో వెల్లడి కానుంది.<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260316-wa0102.jpg" alt="IMG-20260316-WA0102" width="672" height="703"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/jeevan-reddy-joins-brs-as-a-political-earthquake-in-jagittala/article-1046</link>
                <guid>https://www.churakalu.com/telangana/jeevan-reddy-joins-brs-as-a-political-earthquake-in-jagittala/article-1046</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 19:56:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260316-wa0102.jpg"                         length="53065"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లింగమూర్తి మృతి విద్యారంగానికి తీరని లోటు </title>
                                    <description><![CDATA[<p>కాకతీయా <img src="https://www.churakalu.com/media/2026-03/img-20260315-wa0056.jpg" alt="IMG-20260315-WA0056" width="1200" height="975" />మాజీ వీసి<br />ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి మృతి విద్యారంగానికి తీరని లోటు</p>
<p>నేదునూరి కనకయ్య <br />తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం <br />అధ్యక్షుడు </p>
<p><br />కరీంనగర్, మార్చ్,15</p>
<p>ప్రముఖ ఆర్థికవేత్త, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ లింగమూర్తి ఆకస్మిక మరణం ఆర్థిక శాస్త్రానికి, యూనివర్సిటీ విద్యారంగానికి తీరని లోటని <br />తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం <br />అధ్యక్షుడు నేదునూరి కనుకయ్య <br />ఒక ప్రకటనలో తెలిపారు.</p>
<p>కాకతీయ విశ్వవిద్యాలయ వీసీగా పనిచేసిన లింగమూర్తి <br />అనారోగ్య కారణాలతో శనివారం <br />వరంగల్ లో మృతి చెందారు.</p>
<p>ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో కనుకయ్య మాట్లాడుతూ<br />కాకతీయ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెట్టి, యూనివర్సిటీ విద్యను గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులోకి  తేవడానికి ఆయన అమలు చేసిన సంస్కరణలు వెలకట్టలేని వన్నారు.ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రొఫెసర్ లింగమూర్తి మరణం ఉన్నత విద్యారంగానికి తీరని లోటని, వారి ఆశయాల సాధన కొరకు కృషి చేయడమే నిజమైన నివాళి అని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/telangana/lingamurthys-death-is-a-huge-loss-for-the-education-sector/article-1044"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260315-wa0057.jpg" alt=""></a><br /><p>కాకతీయా <img src="https://www.churakalu.com/media/2026-03/img-20260315-wa0056.jpg" alt="IMG-20260315-WA0056" width="1440" height="975"></img>మాజీ వీసి<br />ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి మృతి విద్యారంగానికి తీరని లోటు</p>
<p>నేదునూరి కనకయ్య <br />తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం <br />అధ్యక్షుడు </p>
<p><br />కరీంనగర్, మార్చ్,15</p>
<p>ప్రముఖ ఆర్థికవేత్త, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ లింగమూర్తి ఆకస్మిక మరణం ఆర్థిక శాస్త్రానికి, యూనివర్సిటీ విద్యారంగానికి తీరని లోటని <br />తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం <br />అధ్యక్షుడు నేదునూరి కనుకయ్య <br />ఒక ప్రకటనలో తెలిపారు.</p>
<p>కాకతీయ విశ్వవిద్యాలయ వీసీగా పనిచేసిన లింగమూర్తి <br />అనారోగ్య కారణాలతో శనివారం <br />వరంగల్ లో మృతి చెందారు.</p>
<p>ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో కనుకయ్య మాట్లాడుతూ<br />కాకతీయ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెట్టి, యూనివర్సిటీ విద్యను గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులోకి  తేవడానికి ఆయన అమలు చేసిన సంస్కరణలు వెలకట్టలేని వన్నారు.ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రొఫెసర్ లింగమూర్తి మరణం ఉన్నత విద్యారంగానికి తీరని లోటని, వారి ఆశయాల సాధన కొరకు కృషి చేయడమే నిజమైన నివాళి అని నేదునూరి కనకయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దూరవిద్య వ్యాప్తి కోసం కృషిచేసి <br />గ్రామీణులకు సైతం విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రగతి శీల, ప్రజాస్వామ్య పాలనా వేత్తగా లింగమూర్తిని అభివర్ణించారు.<br />సమావేశంలో ఎకనామిక్ ఫోరం సలహాదారులు డాక్టర్ కే మురళి మాట్లాడుతూ ప్రొఫెసర్ లింగమూర్తి మూర్తి లేబర్ ఎకనామిక్స్ లోపట్టున్న గొప్ప ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శ్రామిక విధానాల రూపకల్పనలో ఆయన <br />క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు.ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సి హెచ్  శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ విసి లింగమూర్తి యూనివర్సిటీ విద్యా అభివృద్ధికి  చేసిన సేవలను కొనియాడుతూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువ ఆర్థికవేతలకు స్పూర్తిగా నిలుస్తాయన్నారు.<br />ఈ సమావేశంలో డాక్టర్ మనోహరచారి, డాక్టర్ టివి స్వామి,  పరుశరాంరెడ్డి,  వీరాస్వామి,<br />బైరీ సుధాకర్, తిరుమల్ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.churakalu.com/telangana/lingamurthys-death-is-a-huge-loss-for-the-education-sector/article-1044</link>
                <guid>https://www.churakalu.com/telangana/lingamurthys-death-is-a-huge-loss-for-the-education-sector/article-1044</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 17:27:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260315-wa0057.jpg"                         length="69126"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        