కలెక్టర్ కార్యాలయం ముందు కలాంగుని నిరసన
By: Mohammad Imran
On
వికలాంగుని నిరసన
మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మర్రిపెల్లి రాజ గంగారం అనే వికలాంగుడు తన ఇంటికి దారి ఇవ్వడం లేదని ఈ విషయంపై గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు
కానీ ఆర్డీవో ఎమ్మార్వో మరియు ఎంపీడీవో ఎవరు కూడా న్యాయం చేయడం లేదని
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పడుకుని నిరసన తెలిపాడు.. మర్రిపెల్లి రాజు అనే వికలాంగుడు జగిత్యాలలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి చేరుకున్న అతను తనకు న్యాయం చేయాలని, 8 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవటంలేదని .. ఇంటికి వెళ్లేందుకు దారి ఇప్పించాలని వేడుకున్నారు.. నిరసన తెలుపుతున్న బాధితుడి వద్దకు చేరుకున్న పోలీసులు అధికారుల వద్దకు తీసుకెళ్లారు... న్యాయం చేస్తానని హామి ఇవ్వటంతో ఆందోళన విరమించాడు.
Tags: