నా రాజీనామా కు కారణం కూడా అదే... ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం,, బిజెపి నాయకురాలు బొగ శ్రావణి

నా రాజీనామా కు కారణం కూడా అదే... ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం,, బిజెపి నాయకురాలు బొగ శ్రావణి

నా రాజీనామాకు కారణం కూడా అదే..

ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడు

కిబాల అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించాలి 

మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి.

  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
  • చురకలు విలేఖరి
  • జగిత్యాల

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్ మీట్ నిర్వహించారు. పట్టణంలో సంచలనంగా 100 కోట్ల భూకబ్జా ఆరోపణలపై శ్రావణి స్పందించారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడే పెట్రోల్ పంపు భూకబ్జా విషయంలో మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు. ఒక దశలో చైర్పర్సన్ గా తన రాజీనామాకు ఈ పెట్రోల్ పంపు వ్యవహారమే కారణమని అన్నారు. గతంలోనే రెండు మూడు సందర్భాల్లో తన రాజీనామా కు ముందు ఆ తర్వాత కూడా తాను మున్సిపల్ భూమి కబ్జాతో పాటు పెట్రోల్ పంప్ వ్యవహారం పై మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.యావర్ రోడ్డు విస్తరణకై తొలి ప్రయత్నం గా మాస్టర్ ప్లాన్ ప్రకారం  డివైడర్ కడుతున్న సందర్భంలో ఐదు ఫీట్లు ఆర్ అండ్ బి ఆఫీస్ సైడ్ అలైన్మెంట్ చేయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వస్తుందనిపంపు విషయం బయటకు వస్తుందని ఒత్తిడి తీసుకువచ్చారు. ఒక దశలో మొదలుపెట్టిన డివైడర్ నిర్మాణాన్ని సైతం మార్చి కట్టేలా చేసారు. కబ్జాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు అప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నన్ను నడిరోడ్డు పైన నిలబెట్టి ఇది మా వ్యక్తిగత విషయం నువ్వు తలదూర్చకని ఒత్తిడి తీసుకొచ్చారు. పెట్రోల్ పంపుకు అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆరోజు నా మీద ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఏంటని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. నిజాలు తెలిసి కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు.1948 సెప్టెంబర్ 17 న నిజాం పాలనా ముగిసి 1949 ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం కొన్నట్టు ఏ విధంగా తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదు అన్నారు.ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై పొలిటికల్ ప్రెజర్ ఉందని సందేహాత్మకంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేశారు. తాను చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి రికార్డులు మున్సిపల్ లో లభించలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మాట్లాడడం హర్షించదగ్గ విషయమని అయితే మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణకై పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రజల ఆస్తి ప్రజలకు చెందేలా చేయాలని ఇందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న సహకారం ఉంటుందని తెలిపారు. ఇక ఇటీవల అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే స్థానిక ఎమ్మెల్యే తానే తీసుకువచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అభివృద్ధి చేయండి హర్షిస్తాం కానీ మందికి పుట్టిన పిల్లల్ని తమ పిల్లలని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు ఎంపీ అరవింద్ అన్న కృషి చేస్తున్నారని అందులో భాగంగానే జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి,జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, బొడ్డు పెద్ద గంగారం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, సాంబారి కళావతి, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, మర్రిపల్లి సాగర్, ఇట్యాల రాము, కాశెట్టి తిరుపతి, గడ్డల లక్ష్మి, మామిడాల కవిత, బద్దెల గంగరాజం మరియు తదితరులు పాల్గొన్నారు.IMG-20251107-WA0061IMG-20251107-WA0061

Tags: