డీఎస్పీ మహేష్ కు అభినందించిన ఎస్పీ
ముంబై మారథాన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీ మహేష్ను అభినందించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
ముంబై మారథాన్–2026లో నారాయణపేట జిల్లా నుండి డిసిఆర్బి డీఎస్పీ మహేష్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. టాటా ముంబై మారథాన్ (42.197 కిలోమీటర్లు) లాంగ్ రన్లో పాల్గొన్న ఆయన, 5 గంటల 21 నిమిషాలు 30 సెకండ్లు అనే ఉత్తమ టైమింగ్తో మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి రెండు మెడల్స్ సాధించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS మెడల్స్ తో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
పోలీస్ విధులతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం డీఎస్పీ మహేష్ ప్రత్యేకత అని అన్నారు. ఆయన సాధించిన విజయం యువతకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నిరంతర సాధనతో క్రీడల్లో ముందుకు సాగుతూ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చినందుకు డీఎస్పీ మహేష్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆయన సాధించిన ఈ ఘనవిజయం నారాయణపేట జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని, జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, క్రీడాభిమానులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మారథాన్ రన్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య ముంబై మారథాన్ రెండు మెడల్స్ సాధించిన డీఎస్పీ మహేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

