మద్యం సేవించిన ముగ్గురు విధ్యుత్ ఉద్యోగుల సస్పెండ్
మద్యం సేవించిన ముగ్గురు ఏ, ఎల్ యం. లు సస్పెండ్
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్, 16
జగిత్యాల సర్కిల్ టౌన్ - 1 సెక్షన్ కార్యాలయ ఓ &యం స్టాఫ్ రూమ్ లో శనివారం ముగ్గురు అసిస్టెంట్ లైన్ మెన్లు ఏ. ప్రభాకర్ , జి. బాలకృష్ణ , వి. రాజశేఖర్ మందు పార్టీ చేసుకునట్లు ప్రాధమిక విచారణలో నిర్ధారణ అయినందున వెంటనే ఆ ముగ్గురు అసిస్టెంట్ లైన్ మెన్లను సస్పెండ్ చేయడం జరిగిందని జగిత్యాల డివిజినల్ ఇంజనీర్ గంగారాం తెలిపారు.
ఈ విషయంపై సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్లలోని అన్ని సబ్స్టేషన్లు, విద్యుత్ సంస్థ కార్యాలయాలు లేదా సంస్థ ప్రాంగణంలో విధులు నిర్వహించే ప్రదేశలలో అనైతిక కార్యకలాపాలు , క్రమశిక్షణా విరుద్ధ చర్యలకు పాల్పడితే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఉద్యోగస్తులకు , సిబ్బందికి హెచ్చరిస్తున్నామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు . ఒక వేళా విధులకు సంబంధించి ఏవైనా ఉద్యోగి ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించి అనైతిక చర్యలకు పాల్పడిన పక్షంలో విధుల నుండి తక్షణమే తొలగిస్తామని గట్టిగా హెచ్చరించారు . ఇందుకు సంబంధించి హెచ్ఆర్డి విభాగం నుండి అడ్వైజరీ మెమోను జారీచేసినారు.
అందరూ విధుల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరించి, సంస్థ ప్రతిష్టను కాపాడాలని వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు .

