నకిలీ విత్తనాలను అరికట్టెందుకు ప్రత్యేక నిఘా ఎస్పీ అశోక్ కుమార్
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా.
బక్రీద్ సందర్భంగా భద్రత పరమైయన ఏర్పాట్లు పూర్తి చేయాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 29 : నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టామని, బక్రీద్ సందర్భంగా భద్రత పరమైయన ఏర్పాట్లు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు.ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కేసులపై పురోగతి, జిల్లా వ్యాప్తంగా నమోదైన తాజా నేరాల విశ్లేషణ, నేర నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సీసీటీవీ వ్యవస్థల ప్రాముఖ్యత, వాటి నిర్వహణ,రాత్రి గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, మహిళల భద్రతపై,రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ మరియు అసాంఘిక కార్యకలాపాల పై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే వెంటనే ఫోటోలు సీసీటీఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్ కేసులను ఛేదించవచ్చని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. రాబోవు బక్రీద్ సందర్భంగా జిల్లా లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు గోవుల అక్రమ రవాణా, గోవధను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సంతలో కొనుగోలు చేసిన పశువులకు, సంబంధిత పశు వైద్యాధికారిచే ఆరోగ్య మరియు రవాణాకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. గోవుల రవాణా జరిగే ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే సాకుతో బృందాలుగా ఏర్పడి అల్లర్లకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులను నమోదుచేయాలని అదికారులను ఆదేశించారు. గతంలో నకిలీ విత్తనాలను అమ్ముతూ పట్టుబడ్డ వారి వివరాలను సేకరించాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక రైతులకు నకిలీ పత్తి విత్తనాలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీ విత్తనాల నివారణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క టీం జిల్లాలో వ్యవసాయ అధికారులను సహాయంతో అన్ని ఎరువుల దుకాణంలో తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా విత్తనాలు అమ్మితే కొనుగోలు చేయ వద్దని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు, వ్యవసాయ అధికారులకు తెలపాలని లేదా డయల్ 100 కాల్ చేసి తెలిపినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు తిరుపతి నాయక్ ,శ్రీనివాస్ లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను అరికట్టడానికి మరియు వాటిని గుర్తించడానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. పెద్ధ హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంలో, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పిలు వెంకట రమణ, రఘు చంధర్, రాముల, రంగారెడ్డి మరియు డీసీఆర్బీ,
ఎస్బి, ఐటీ కోర్ ,సీసీఎస్ , ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్,రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇనస్పెక్టర్ వేణు, సిఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి,అనిల్ కుమార్, కృష్ణ రెడ్డి, సురేష్ ఎస్ఐలు,డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.