ద్విచక్ర వాహనాన్ని ఆటో ను డీ కొన్న ట్రాలీ ఆటో
ద్విచక్ర వాహనాన్ని ఆటో ను డీ కొన్న ట్రాలీ ఆటో
ట్రాలీ ఆటో డ్రైవర్ తో సహా నలుగురికి తీవ్రంగా గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
కరీంనగర్ తరలింపు
చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 30 ;
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం ఎల్లమ్మ గుడి పెట్రోల్ బంక్ సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి పై సోమవారం రాత్రి 7-00 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటోను ట్రాలీ ఆటో డ్రైవర్ బాల సంతుల పరిషయ్య అతి వేగంగా ఆజాగ్రత్తగా నడుపుతూ అతి వేగంతో డీ కోట్టాడు ,
ఈ సంఘటనలో వెంకటపురం గ్రామానికి చెందిన రాగుల చంద్ పులి బాలయ్య లిద్దరూ ద్విచక్ర వాహనం పై సిరిసిల్లకు వెళ్లి వెంకటాపురం వస్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఇనుప సామాన్లు ఉన్న ట్రాలీ ఆటో డీ కొట్టింది అదే విధంగా ఎదురుగా సిరిసిల్ల నుండి వెంకటాపురం వస్తున్న ప్యాసింజర్ ఆటో ను కూడా పెట్రోల్ బంకు సమీపంలో సిరిసిల్ల కామారెడ్డి రోడ్డుపై ఢీ కొట్టింది,
ఆ సమయంలో ప్యాసింజర్ ఆటో లో ప్యాసింజర్ ఆటో డ్రైవర్ సంపత్ ఓక్కరే ఉన్నాడు తీవ్రంగా గాయపడ్డాడు ఆ సమయంలో ప్యాసింజర్ ఆటోలో ప్యాసింజర్లు ఉండి ఉంటే భారీ ప్రమాదం భారీ ప్రాణం నష్టం జరిగి ఉండేదని సంఘటన స్థలం వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షం తెలిపారు,
సంఘటన స్థలంలో గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి గాయపడిన
పులి బాలయ్య ను ట్రాలీ ఆటో డ్రైవర్ పర్షరాములు లను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు ,
పరిస్థితి విషమంగా ఉన్న రావుల చంద్ ను సంత్ ను కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు , ఎస్ ఐ రామాకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,

