సాముహిక కుంకుమార్చన టో కళకళలాడిన అమ్మ వారి మండపం
సామూహిక కుంకుమార్చన తో కళకళలాడిన అమ్మ వారి మండపం....
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్,04.
కనక దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అష్ట లక్ష్మి దేవాల బాయ అవరణలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రెండవ రోజు శుక్రవారం బ్రహ్మ చారిని రూపంలో కనక దుర్గ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా సాయంత్రం వేదపండితులు, గోవిందుల రాధాకృష్ణ, పాలేపు చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మాతలచే సామూహిక కుంకుమార్చన తో మంగళవాయిద్యాలు వేలాది భక్తులకు అమ్మవారు దేదీప్య మానంగా ముగ్గురమ్మల మూలపుటమ్మ శోభాయ మానంగా కళకళలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులతో అమ్మవారు మండపం కిటకిటలాడింది.అనంతరం సప్త హారతులతో మండపం ప్రాంగణం భక్త కీర్తనలతో మారుమోగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం వితరణ జరిగిందని కనక దుర్గ సేవా సమితి కమిటీ సభ్యులు తెలిపారు.

