Churakalu News

Churakalu News

*ప్రవక్త బోధనలు యావత్* *మానవాళికి దిక్సూచి* 
 *మిలాద్-ఉన్-నబీని ముస్లిం* *సోదరులు ఘనంగా జరుపుకోవాలి* 

 *కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ* *ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు* 

 *చురకలు ప్రతినిధి కరీంనగర్*..

శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే మహమ్మద్ ప్రవక్త  బోధనలు యావత్  మానవాళికి దిక్సూచి లాంటివని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. 

సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్- నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు, సోదరీ మణులందరికీ వెలి చాల రాజేందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిద్‌క్ (సత్యనిష్ట), తహారత్ (పవిత్రత), జకాత్ (సహాయం) రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
ప్రతీ ముస్లీం సోదరుడు ఆ ప్రవక్త ప్రవచించిన సన్మార్గాలను పాటిస్తూ,  పవిత్ర మిలాద్-ఉన్-నబీ పండగను ఇంటింటా భక్తిశ్రద్ధల మధ్య,  ఆనందో త్సవాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు.
ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని, అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.IMG-20240916-WA0002

Tags:

Related Posts