గల్ఫ్ బోర్డు ఏర్పాటు పై దుబాయ్ లో సంబురాలు
గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు పై దుబాయ్ లో సంబురాలు
దుబాయ్, సెప్టెంబర్,22
దుబాయి. డా|| బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటూ చేసిన ముఖ్యమంత్రి ఏనమల రేవవంత్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలుపుతూ టీపీసీసీ గల్ఫ్ ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ దుబాయి ఎస్వి రెడ్డితో కేక్ కటింగ్ మరియు పాలాభిషేకం చేస్తూ ఎస్ వి రెడ్డి కు సన్మానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎస్. వి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రార్టీ అంటేనే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయిన కూడ గల్ఫ్ లో ఏప్పటి కప్పుడు గల్ఫ్లో ప్రతి లేబర్ క్యాంప్ తిరిగి వారి సమస్యలను 'తెలుసుకొని ఈ సమస్యలు ఏలా తీరాలి అనే ఆలోచనతో ఎన్నికల ముందు విది విధానాలతో కూడిన గల్ఫ్ సంక్షేమ భోర్డు ఏర్పాటు చేస్తాము అని ప్రమాణం చేసి గెలిచినా 9 నెలల వ్యవధిలోనే గల్ఫ్ సంక్షేమ బోర్దు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే బి, ఆర్,ఎస్ పార్టీ రెండు సార్లు 500 కోట్లతో గల్ఫ్ సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తాo అని ప్రమాణం చేసి రెండూ సార్లు మోసం చేసారని ఎస్ వి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం చెప్పిన వాగ్ధానం చేసి చూపించే పార్టే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయి అంబేద్కర్ సంగం అధ్యక్షులు ఎన్.నర్సయ్య , కోఆర్డినేటర్ జే.నారాయణ,సంఘం సభ్యులు మరియు సదతుల్లా , విజయ్ ,సుదర్శన్ , రాజేష్ పంతులు ,ఎడ్విన్,ప్రేమ్ ,రవి చంద్ర మరియు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

