ఎల్ఐసి ఎజెంట్ల నిరసన

ఎల్ఐసి ఎజెంట్ల నిరసన

ధర్మపురి ఎల్ఐసి కార్యాలయంలో ఏజెంట్ల నిరసన. 
..................................
రామ కిష్టయ్య సంగన భట్ల
............ . ...........

ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఎల్ ఐ సి  పాలసీల ప్రీమియంపై  జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి ఎల్ఐసి కార్యాలయంలో జీవిత బీమా ఏజెంట్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జీవిత బీమా ఏజెంట్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ పాలసీదారులకు  పాలసీలపై బోనస్ రేటు పెంచాలని, జీవిత బీమా సంస్థ ఏజెంట్ల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  అనంతరం ఎల్ఐసి ఏవో ఎస్ బి  నరసయ్యకు వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ల యూనియన్ నాయకులు భరతపు గుండయ్య , వొడ్డేటి భూమన్న,  వేముల భాస్కర్, మల్లేశం, ఉప్పుల రామకృష్ణయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.IMG-20241007-WA0005

Tags:

Related Posts