తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వుంట్ల విద్యాసాగర్ రావు
మెట్పల్లి
తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మెట్పల్లి పట్టణ తెలంగాణ తల్లి విగ్రహానికి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్యనారాయణ పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మాట్లాడుతూ
సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయాలనీ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పాలాభిషేకం చేశామని అలాగే పోరాడి తెచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అవమాన పరుస్తుందని దీనిని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానా వేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి కౌన్సిలర్ మొరపు గంగాధర్ ధ్యావన పెళ్లి రాజారాం భీమనాతి సత్యనారాయణ పూజగిరి శ్రీనివాస్ ,ఉజ్జల శ్రీనివాస్, దశరథ్ రెడ్డి, డబ్బా నరసన్న, రాజాగౌడ్, తిరుపతిరెడ్డి తదితరులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

