మౌళిక వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లకు వినతి
మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి వినతి
జగిత్యాల పట్టణ పేదలకు నూక పల్లి శివారులో జగిత్యాల అర్బన్ కాలనీ పేరట గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పించాలని డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి అరకొర వసతులతో సుమారు 200 కుటుంబాల వరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో తమ బాధలను చెప్పుకున్నారు కరెంటుకు సంబంధించి ప్యానెల్ బోర్డు కూడా బిగించడం జరిగిందని కొందరు మీటర్లకు కూడా అప్లై చేసుకున్నామని ఇళ్లల్లో మీటర్లు బిగించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వివ్రత పత్రంలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ను కలిసిన వారిలో బొల్లారపు స్వామి. ఎండి ఖలీల్ జంగిల్ గంగాధర్. రాజేష్ సుశీల శివాజీ కిషోర్ విజయ సంతోష్ చందు ఆక్మల్ రాజేష్ వున్నారు,

