కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
.................................. ......... .
తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు
...... ..... .. ..... .............
రామ కిష్టయ్య సంగన భట్ల
........ .............................
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల తుమ్మె
నాల , తిమ్మాపూర్ రాయపట్నం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో తపస్ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డి. ఏ లను సత్వరమే మంజూరు చేయాలని ,ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 25ని సవరణ చేయాలని ,ఏకోపాధ్య పాఠశాలలో కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రమోషన్లను నెలవారిగా చేపట్టాలని కోరారు .ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినా మేరకు సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని అదేవిధంగా 317 జి ఓ ద్వారా నష్టపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసి వారి స్థానిక ప్రదేశాల్లోనే వారికి ఉద్యోగాలను . కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండి మహేష్ జిల్లా కార్యదర్శి కాశెట్టి రమేష్ ,మండల అధ్యక్షుడు కాశెట్టి శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి బి .శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

