గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు సిఐ నిరంజన్ రెడ్డి
By: Mohammad Imran
On
గణేష్ నిమ్జనానికి సహాకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
సిఐ నిరంజన్ రెడ్డి 
మెట్ పల్లీ చురకలు ప్రతినిధి
మెట్ పల్లీ సర్కిల్ పరిధిలోని పట్టణ,మండలాల్లో జరిగిన గణేష్ నిమర్జన వేడుకలు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరగడానికి సహకరించిన యువతకు,సంబధిత అధికారులకు మెట్ పల్లీ సీఐ నిరంజన్ రెడ్డీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంధర్బంగా బుధవారం సీఐ నిరంజన్ రెడ్డీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో గణేష్ నిమార్జన వేడుకలో బందోబస్తుగా వచ్చిన పోలీస్ శాఖ వారి చురుకుగా విధులు నిర్వహిస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ శోభయత్రని విజయవంతం చేసి సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సహకరించిన అన్ని మతాలు,యువత,మహిళలకు అన్ని సంబధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Tags:

