ఆర్డీఓ కార్యాలయం లో వెంకట స్వామి జయంతి
By: Mohammad Imran
On
*జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం లో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు...
జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం లో శనివారం కాక వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వెంకట్ స్వామిగారి చిత్ర పటానికి పూలమాలవేసి ఆర్డీఓ పులి మధు సుధన్ నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకా వెంకట్ స్వామి ఆశయ సాధన కోసం పేద వర్గాల, అణగారిన వర్గాల, అట్టడుగు వర్గాల కోసం నిరంతరం తపించారని కొనియాడారు
ఈ కార్యక్రమంలో తఫేజ్ఉల్ హుస్సేన్, కుమారస్వామి, అచ్యుత రెడ్డి ,చరణ్, మూర్తి గౌస్ షరీఫ్ ,అర్చన మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:

