సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం మాజీ మంత్రి జీవన్ రెడ్డి
సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం.
ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తి.. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.
మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 29 : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికీ ఆదర్శమని, ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తి.. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ
చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి తప్పా వేరే పార్టీలకు లేదని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.21 వేల కోట్లతో రైతులను రుణవిముక్తులను చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ చేయాలని ఆలోచన కూడా చేయకపోవడం బిజెపి రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనమని, బిజెపి రైతులకు రుణమాఫీ చేయకుండా వ్యాపారవేత్తలైన అంబానీ, ఆదానీల రుణాలను మాఫీ చేస్తుందన్నారు. ప్రతిపక్షం అంటే బట్ట కాల్చి మీద వేయడం కాదని, ప్రతిపక్షాలు ప్రశ్నాలను లేవనెత్తి నిర్మాణత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామంటే బిఆర్ఎస్ ఎద్దేవా చేసిందని, కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందని, నిరుపేదలకు అండగా నిలిచేలా గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకాలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ రూ.500 అందిస్తూ రైతాంగానికి అండగా నిలుస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు రేషన్కార్డులు అందిస్తుందని, గతంలో పంపిణీ చేసిన దొడ్డు రకం బియ్యం ప్రజలు ఉపయోగించడం లేదని, రేషన్కార్డుదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.500 పెంచాల్సిది పోయి కేవలం రూ.69 మాత్రమే పెంచడం దారుణమని, పప్పు దినుసులకు మద్దతు ధర రూ. 10వేలు కంటే తక్కువగా ఉంటే రైతులకు గిట్టుబాటు కాదన్నారు. యూపీఏ హాయంలో వరికి మద్దతు ధర
రూ.650 ఉంటే రూ.1400లకు పెంచామని, బిజెపి పాలనలో రూ.1400 నుండి రూ.2389లకు పెరిగిందని కనీసం రెండింతలు కూడా పెరగలేదన్నారు. రైతుల పట్ల బిజెపి ప్రభుత్వం
సానుకూలంగా ఉంటే జాతీయస్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని సూచించారు. బిజెపి ప్రభుత్వం క్వింటాల్ వరి ధాన్యానికి కనీస రూ.69 పెంచితే బిజెపి నాయకులు సంబరాలు
చేసుకోవడం ఏమిటని, క్వింటాలు రూ.500 పెంచితే తాము కూడా సంబరాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, జున్ను రాజేందర్, కల్లె పెల్లి దుర్గయ్య, రాధాకిషన్, బారీ, నేహాల్, సురేందర్, రఘువీర్ గౌడ్, భీరం రాజేష్, గుండ మధు, నాగేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.