ఆర్ ఎస్ యు నుండి కేంద్ర కమిటీ కార్యదర్శి గా నంబాల కేశవ్ రావు

ఆర్ ఎస్ యు నుండి కేంద్ర కమిటీ కార్యదర్శి గా నంబాల కేశవ్ రావు

మెరుపుదాడుల వ్యూహకర్త నంబాల కేశవరావు ఇకలేరు!
ఆర్‌ఎస్‌యూ నుంచి మావోయిస్టు కెప్టెన్‌ దాకా ప్రస్థానం!
మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా, మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన 55 గంటల ఎదురుకాల్పుల్లో కేశవ రావు హతమయ్యారు. 

   FB_IMG_1747917769968

నంబాల కేశవ రావు, అలియాస్ బసవరాజు, భారత మావోయిస్టు పార్టీ (CPI-Maoist) యొక్క కీలక అగ్రనేత మరియు ప్రధాన కార్యదర్శి, 2025 మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మరణించారని, వారిలో కేశవ రావు కూడా ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్రువీకరించారు. ఈ సంఘటనను నక్సలిజం నిర్మూలనలో మైలురాయిగా అమిత్ షా అభివర్ణించారు, ఇది మూడు దశాబ్దాల నక్సల్ వ్యతిరేక పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు హతమైన తొలి సంఘటనగా పేర్కొన్నారు.
......
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌ నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. నక్సల్‌ ఉద్యమంలో సాధారణ కార్యకర్తగా చేరిన నంబాల మావోయిస్టు పార్టీలో అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. ఆర్‌ఎస్‌యూలో క్రియాశీలకార్యకర్తగా వ్యవహరించిన నంబాల 1984లో పీపుల్స్‌వార్‌లో చేరారు. ఆయన 2018 నుంచి మావోయిస్టు పార్టీకి జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి మృతిచెందడం ఇదే ప్రథమం. శ్రీకాకుళం జయ్యన్నపేటలో మొదలైన నంబాల జీవితం ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అడవుల్లో పరిసమాప్తమైంది. జయ్యన్నపేట నుంచి వరంగల్‌ ఆర్‌ఈసీ మీదుగా అజ్ఞాతంలోకి వెళ్లిన నంబాల ప్రస్థానం ఇది.
......
కేశవ రావు 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం, జియ్యన్నపేట గ్రామంలో ఒక సామాన్య కాళింగ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చదివారు మరియు 1984లో ఎం.టెక్ చదువుతూ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, చదువును మధ్యలోనే వదిలి ఉద్యమంలో చేరారు.

◾ నేషనల్‌ వాలీబాల్‌ ప్లేయర్‌....

అజ్ఞాత జీవితంలోకి వెళ్లకముందు నంబాల వాలీబాల్‌ ప్లేయర్‌గా రాణించారు. ఉమ్మడి రాష్ట్ర వాలీబాల్‌ జట్టు నుంచి నేషనల్స్‌ కూడా ఆడారు. అంతకుముందు ఆయన కాకతీయ యూనివర్సిటీ కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలలో ఆయన కేయూకు ప్రాతినిధ్యం వహించారు. 

◾ అజ్ఞాతబాట...

శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటలో 1955లో జన్మించిన నంబాల కేశవరావు వరంగల్‌ ఆర్‌ఈసీ (నిట్‌)లో ఎంటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) చదువుతున్నప్పుడే ఆర్‌ఎస్‌యూ (రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌)లో చురుకైన పాత్ర పోషించారు. కాలేజీలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ మధ్య సైద్ధాంతిక విభేదాలు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు కొనసాగేవి. అలా ఒకసారి ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన దాడిలో నంబాలపై కేసు నమోదైంది. పోలీసుల వేధింపులు, నిత్యఘర్షణలు ఎక్కువ కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, వరంగల్‌లో ఆర్‌ఈసీ విద్యార్థిగా ఉన్నప్పుడు హమాలీల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన రాత్రిపూట హమాలీగా పనిచేశారు.

◾ మావోయిస్టు ఉద్యమంలో పాత్ర.....

 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU)లో చురుకైన సభ్యుడిగా ఉద్యమంలోకి ప్రవేశించారు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి వంటి నాయకుల ప్రభావంతో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు.

◾ ఆరంభ బాధ్యతలు...

విశాఖపట్నం, తూర్పు గోదావరి ప్రాంతాలలో పనిచేశారు. 1992లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు మరియు 2004లో పీపుల్స్ వార్ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI) విలీనంతో ఏర్పడిన CPI-Maoistలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు.

◾ఈస్ట్‌ డివిజన్‌ నుంచి మావోయిస్టు సుప్రీం కమాండర్‌ దాకా.....

కొండపల్లి సీతారామయ్య (కేఎస్‌) నాయకత్వంలో పురుడుపోసుకున్న పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ (పీడబ్ల్యూజీ) తొలితరం నాయకుల్లో నంబాల ఒకరు. గణపతి, కిషన్‌జీ, మల్లా రాజిరెడ్డి మొదలైనవాళ్లు మొదటి బ్యాచ్‌ అయితే, నంబాల సెకండ్‌ బ్యాచ్‌కు చెందినవారు. నంబాల ఈస్ట్‌ డివిజన్‌ (తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మీదుగా ఒడిశా దాకా) నుంచి అజ్ఞాతజీవితం మొదలైంది. ఈస్ట్‌ డివిజన్‌ మొదటి దళం సభ్యుడిగా, దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడి (డీసీఎస్‌)గా, జిల్లా కార్యదర్శి (డీసీ)గా, స్టేట్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి డీకే (దండకారణ్య కమిటీ) కార్యదర్శిగా వ్యవహరించారు. 1991లో పీపుల్స్‌వార్‌ నుంచి కొండపల్లి సీతారామయ్య నిష్క్రమణ తరువాత నంబాల కేశవరావు 1992లో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ (సీసీ) సభ్యుడయ్యారు. సీసీ మెంబర్‌గా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ మావోయిస్టు దళపతి ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి తరువాత నెంబర్‌ 2 స్థానానికి ఎదిగారు. మావోయిస్టు పార్టీలో అత్యున్నతమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ) చీఫ్‌గా వ్యవహరించారు. 25 ఏండ్లపాటు ఇటు పీపుల్స్‌వార్‌కు, అటు మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన గణపతి అనారోగ్య కారణాల రీత్యా మావోయిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ నంబాల కేశవరావును 2018లో ఆ స్థానానికి ఎన్నుకున్నది.

◾ సైనిక వ్యూహకర్త....

గెరిల్లా యుద్ధం, ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్) తయారీలో నైపుణ్యంతో పార్టీకి మూలస్తంభంగా నిలిచారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ LTTE మరియు సైనికుల వద్ద శిక్షణ పొందారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది CRPF జవాన్ల మరణానికి సూత్రధారిగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.

◾ ప్రధాన కార్యదర్శిగా.....

2018లో గణపతి అనారోగ్యం కారణంగా రాజీనామా చేయడంతో, కేశవ రావు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు

◾ మారుపేర్లతో మనుగడ....

తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ప్రజలు ఇష్టంగా పిలుచుకునే పేరుతోనే ఉద్యమకారులు ప్రాచుర్యం అవుతారు. అలా సుదీర్ఘ ఉద్యమ జీవితంలో నంబాలకు ఎన్నిపేర్లు ఉన్నాయో లెక్కలేదంటారు. పోలీసు రికార్డుల ప్రకారం నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు చిరపరిచితమైంది. ఇంకా గగన్న, గంగన్న, ప్రకాశ్‌, కృష్ణ, విజయ్‌, ఉమేశ్‌, రాజు, కామ్లూ ఇలా అనేక పేర్లతో ఆయనను పిలిచేవారని అధికారవర్గాలు తెలిపాయి.

◾ ఆదివాసీలకు బాసటగా....

ఈస్ట్‌ డివిజన్‌లో నంబాల పనిచేస్తున్న కాలంలో ఆ ప్రాంతంలోని జంగ్లాత్‌వాళ్ల (అటవీ అధికారుల) దౌర్జన్యాలు, పెత్తందారులు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా కోంద్‌, కొండరెడ్ల (ఆదివాసీ తెగలు) పోరాటం సాగింది. ఈ పోరాటానికి నంబాల నాయకత్వం వహించి మన్నెంవీరుడిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే కోంద్‌, కొండరెడ్డి తెగలకు చెందిన యువతను విప్లవోద్యమంవైపు నడిపించారు. అలా రిక్రూట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా నంబాలకు మావోయిస్టు పార్టీలో పేరొచ్చింది.

◾ ఎన్‌కౌంటర్ వివరాలు....

స్థలం మరియు సమయం:  2025 మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా, మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన 55 గంటల ఎదురుకాల్పుల్లో కేశవ రావు హతమయ్యారు.

◾ రివార్డు....

ఆయనపై ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైగా రివార్డు ఉందని, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 2013 జీరంఘట్టి దాడి కేసులో రూ.50 లక్షల రివార్డు ప్రకటించిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక DRG జవాన్ కూడా మరణించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో భాగంగా ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో 200 మంది నక్సలైట్లు మరణించారని, 54 మంది అరెస్టయ్యారని, 84 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు.

◾ వివాదం....

 BRS నాయకుడు చంటి క్రాంతి కిరణ్ ఈ ఎన్‌కౌంటర్‌ను "ప్రభుత్వ హత్య"గా అభివర్ణించారు, మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరించిందని ఆరోపించారు. పౌరహక్కుల సంఘం కూడా ఈ ఎన్‌కౌంటర్‌ను ఖండించింది, మధ్య భారతంలో అంతర్యుద్ధం కారణంగా అమాయక ఆదివాసీలు బలవుతున్నారని పేర్కొంది.
......
కేశవ రావు వివాహం చేసుకోలేదు మరియు 43 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు, తన స్వగ్రామానికి ఎప్పుడూ తిరిగి రాలేదని గ్రామస్థులు తెలిపారు. 

◾ మావోయిస్టు పార్టీకి మూలస్తంభం....

నంబాల కేశవరావును మెరుపుదాడుల వ్యూహకర్తగానే కాకుండా సృష్టికర్తగా కూడా పిలుస్తారు. పీపుల్స్‌వార్‌ పార్టీ ఎమర్జెన్సీ (1975-77), ఎమర్జెన్సీ అనంతర కాలంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నది. ‘అన్న’లపై ఆశలు సన్నగిల్లుతున్న కాలంలో, ఉద్యమం వెనకపట్టు పడుతున్నదనుకున్న సమయంలో దేశ విప్లవోద్యమ చరిత్రనే మలుపు తిప్పిన అంబుష్‌ (మెరుపుదాడులు) ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఆదిలాబాద్‌ జిల్లా ఆలంపల్లి ఒకటైతే, ఈస్ట్‌ డివిజన్‌లో దారగడ్డ (దారకొండ) అంబుష్‌ రెండోది. ఒకదానికి సాగర్‌ నాయకత్వం వహిస్తే, రెండోదానికి నంబాల నాయకత్వం వహించారు. ఈ రెండు వరుస ఘటనలు మావోయిస్టు ఉద్యమం (పీపుల్స్‌వార్‌) పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని, పార్టీ క్యాడర్‌లో నైతిక ైస్థెర్యాన్ని నింపాయని చెప్తారు. మెరుపు వ్యూహకర్తగా పేరున్న నంబాల అదే మెరుపు వ్యూహంతో 1986లో తప్పించుకున్నారు. ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎస్‌టీఎఫ్‌ పోలీసులు ఆయనను గాయపరచి అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారి దగ్గరి నుంచి ఆయుధం గుంజుకొని ఫైర్‌చేస్తూ తప్పించుకున్నారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి నంబాల మూలస్తంభం.
......
నంబాల కేశవ రావు మరణం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది, మరియు ఇది నక్సలిజం నిర్మూలనలో భారత ప్రభుత్వం యొక్క కృషికి ఒక ముఖ్యమైన దశగా చెప్పబడుతున్నది.

      

Tags: