ఎన్కౌంటర్ లో నెలకొరిగిన మావొయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి

ఎన్కౌంటర్ లో నెలకొరిగిన మావొయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి

మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి !


ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధిగా ఉన్న రవి
శోకసంద్రంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు
కుటుంబమంతా ఉద్యమంతోనే గాజర్ల రవిపై 25 లక్షల రివార్డ్
.....
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు బుధవారం మృతి చెందారు.
......
ఏజేన్సీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇరువురు మావోయిస్టు నేతలు నేలకొరిగారు. మావోయిస్టు పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల ఓఏబీలో మావోయిస్టలు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్లు జరిగి అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం (2025 జూన్ 18న) తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. వీరిలో గాజర్ల రవి (ఎలియాస్ ఉదయ్), వెంకట రవి లక్ష్మీ చైతన్య (ఎలియాస్ అరుణ), అంజు అనే మావోయిస్టు ఉన్నారు. ఈ ఘటన ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB) ప్రత్యేక జోనల్ కమిటీకి తీవ్ర ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.
.......
అడ్డతీగల ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి (ఎలియాస్ ఉదయ్), వెంకట రవి లక్ష్మీ చైతన్య (ఎలియాస్ అరుణ), అంజు వంటి కీలక నేతల మృతి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏ ఓ బి) ప్రత్యేక జోనల్ కమిటీకి తీవ్ర ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. గాజర్ల రవి, ఏ ఓ బి జోనల్ కమిటీ కార్యదర్శిగా, మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేసే కీలక వ్యక్తి. అతని మృతితో నాయకత్వంలో శూన్యత ఏర్పడి, సాయుధ చర్యల సమర్థత తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. అరుణ, మహిళా విభాగంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె లేకపోవడం మహిళా క్యాడర్‌లను బలహీనపరచవచ్చు.
.......
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల.. నేడు శోకసంద్రంలో మునిగింది. ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. గాజర్ల రవి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగారు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి అంచెలంచెలుగా ఎదిగారు. దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా ఉన్నారు. 

◾కుటుంబమంతా ఉద్యమంతోనే…..

పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న వారిలో వెలిశాలలోని గాజర్ల కుటుంబం ఒకటి. కుటుంబంలోని అందరు కూడా అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. గాజర్ల కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ముద్రవేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మిగతా ముగ్గురు అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్.. 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉండి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. పోరుబాట వీడి కొంతకాలం పాటు మీడియాలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలోనే ఉన్న మరొకరే గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్. నాలుగు దశాబ్దాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు.

◾ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధిగా…..

గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004 అక్టోబర్‌లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఉన్నారు. ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండా‌ను తయారు చేయడం‌లో కామ్రేడ్ గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు.

◾ఎన్‌కౌంటర్ వివరాలు....

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ బలగాలు చింతకూరు, కొయ్యలగూడెం, కొండమొదలు పరిసర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో మూడు ఏకే-47 రైఫిల్స్, మందుగుండు సామగ్రి, సాహిత్య పుస్తకాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో కూంబింగ్ కొనసాగుతోంది.

◾మృతి చెందిన మావోయిస్టు నేతల వివరాలు.....

1. గాజర్ల రవి (ఎలియాస్ ఉదయ్)

వయసు: 40-45 సంవత్సరాలు (అంచనా)

ఊరు: తెలంగాణ రాష్ట్రం, భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం

పాత్ర: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏ ఓ బి) ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి

రివార్డ్: రూ. 25 లక్షలు

నేపథ్యం: గాజర్ల రవి మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా గుర్తింపు పొందాడు. అతను ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో సాయుధ కార్యకలాపాలను సమన్వయం చేశాడు. గతంలో జరిగిన ఎన్‌ఐఏ దర్యాప్తుల్లో అతని పేరు కిడ్నాప్ కేసులతో ముడిపడి ఉంది.

మావోయిస్టు కార్యకలాపాలు: రవి అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడని, భద్రతా బలగాలపై దాడులను ప్రణాళిక వేశాడని ఆరోపణలు ఉన్నాయి.

2. వెంకట రవి లక్ష్మీ చైతన్య (ఎలియాస్ అరుణ)

వయసు: 54 సంవత్సరాలు

ఊరు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, కరకవానిపాలెం

పాత్ర: ఏ ఓ బి ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలు

రివార్డ్: రూ. 20 లక్షలు

నేపథ్యం: లక్ష్మీ చైతన్య, ఎలియాస్ అరుణ, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఆమె తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాలసముద్రం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆమె తల్లి మావి నత కూడా గతంలో మావోయిస్టు ఉద్యమంలో ఉండి మృతి చెందింది.

ముఖ్య ఆరోపణలు

చంద్రబాబు అలిపిరి ఘటన: 2003లో తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన బాంబు దాడిలో అరుణ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే హత్య కేసులు: ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే, అప్పటి ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరావు, మరో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసుల్లో అరుణ నిందితురాలిగా ఉన్నారు. వీరిని దుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద వీరిని హతమార్చారు. సంఘటన 2018 లో జరిగింది.

మావోయిస్టు కార్యకలాపాలు: అరుణ జోనల్ కమిటీలో మహిళా విభాగాన్ని నిర్వహించింది. గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించింది.

3. అంజు: మృతి చెందిన మూడవ వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంజు. ఆమె మావోయిస్టు క్యాడర్‌లో భాగమని భద్రతా బలగాలు గుర్తించాయి.

చలపతి కనెక్షన్: అరుణ భర్త చలపతి, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు. గతంలో శ్రీకాకుళం సమీపంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఈ దంపతులు మావోయిస్టు ఉద్యమంలో కలిసి పనిచేశారు.

◾ ఎన్‌కౌంటర్ ప్రభావం.....

ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గాజర్ల రవి, అరుణ వంటి కీలక నేతల మృతితో ఏ ఓ బి ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉంది. భద్రతా బలగాలు మరింత గాలింపు చర్యలను చేపట్టాయి. మిగిలిన మావోయిస్టులను పట్టుకునేందుకు కృషి చేస్తున్నాయి.

◾గాజర్ల రవిపై 25 లక్షల రివార్డ్.....

ఎన్కౌంటర్ లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ పై 25 లక్షల రివార్డ్ ఉన్నది. నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్ట్ ఉద్యమంలో దళ సభ్యుడిగా చేరి వెనుదిరిగి చూడలేదు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఏవోబి, తెలంగాణ – ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్నది. ఎన్నో దాడుల్లో కీలకంగా ఉన్నారు.Screenshot_20250618_185714_Facebook

Tags: