ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు సీఐ నరంజన్ రెడ్డి

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు సీఐ నరంజన్ రెడ్డి

--- *ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే, కఠిన చర్యలు, పీడీ ఆక్ట్ కేసులు కూడా* --
                  **ఏ. నిరంజన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్  **


చురకలు ప్రతి నిధి
కరీంనగర్, మే, 20
            ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏ. నిరంజన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ అన్నారు 
              బుధవారం  శుభం నగరలే, అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్  ఆదేశానుసారం,  ఏ. నిరంజన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ పి. లక్ష్మా రెడ్డి   లు ఇసుక అక్రమ రవాణా- చట్టపరమైన చర్యలు  అంశంపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ఉన్న రీచ్, క్వారీల నుండి ఇళ్ళు,ఇతరత్రా నిర్మాణాలకు ఇసుక ను కొనుగోలు చేయాలని సూచించారు. మానేరు పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా తరలించ బడుతున్న ఇసుకను కొనుగోలు చేయవద్దని చెప్పారు. 

          ఆ తరువాత గతంలో ట్రాక్ట ర్స్ లలో ఇసుక  అక్రమ రవాణా చేసి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన  చేగూర్తి మరియు దుర్శేడ్ గ్రామస్తులు నలుగురిని కరీంనగర్ రూరల్ మండల్ తహసీల్దార్  ముందు హాజరు పరిచి ఇక ముందు ఎలాంటి అక్రమ రవాణా చేపట్టకుండా ముందస్తుగా లక్ష రూపాయల పూచికత్తు పై బైండ్ ఓవర్ చేసినట్లు సీఐ తెలిపారు.IMG-20250520-WA0125(1)

Tags: