పార్టీలో రెండు పంధాల మధ్య జరుతున్న పోరాటం వాస్తవమే సికాస కార్యదర్శి అశోక్

పార్టీలో రెండు పంధాల మధ్య  జరుతున్న పోరాటం వాస్తవమే సికాస కార్యదర్శి అశోక్

పార్టీలో రెండు పంథాల మధ్య జరుగుతున్న పోరాటం వాస్తవమే..
సికాస కార్యదర్శి అశోక్

చురకలు ప్రత్యేక ప్రతి నిధి

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను (అభయ్) శాంతి ప్రతిపాదనను సికాస సమర్థిస్తున్నదని సింగరేణి కార్మిక సామఖ్య సి కా స కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా పార్టీలో రెండు పంథాల మధ్య ఘర్షణ జరుగుతున్నది వాస్తవమేనని, విప్లవ పార్టీలో రెండు పంథాల మధ్య పోరాటం అభివృద్ధికరమైనదీనని, అనేక కేంద్ర కమిటీ సమావేశాలలో పార్టీ అవలంభిస్తున్న వ్యూహం ఎత్తుగడల గురించి లోతైన చర్చలు జరిగినప్పటికీ వాటిని మార్చుకోవడంలో కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీలు విఫలం అయ్యాయనేది వాస్తవం అని పేర్కొన్నారు.దీని ఫలితంగా వాస్తవ పరిస్థితులకు పొసగని తప్పుడు ఆచరణ కొనసాగడంతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
 కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అమరుడు బస్వరాజు అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతిచర్చల ప్రతిపాదనలను, ఆ తరువాత సోను అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలను సైతం కేంద్ర ప్రభుత్వం గుర్తించకుండా పోలీసు ఆపరేషన్లను, ఎన్కౌంటర్స్ను కొనసాగిస్తున్నదని, ప్రజాస్వామిక దేశం అని భావించే మన దేశంలో భారత ప్రభుత్వం ఇటువంటి మొండి వైఖరిని అవలంభించడం ఏ రకంగానూ సరైనది కాదని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో మా పార్టీ తీవ్రంగా నష్టపోయిన ఈ స్థితిలో ఆయుధాలను త్యజించి రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా ప్రజల సమస్యల పై పని చేస్తూనే రాజ్యాధికారం లక్ష్యంగా విప్లవ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడమే సరైన ఎత్తుగడగా సికాస గుర్తిస్తున్నదని పేర్కొన్నారు.  మెజారిటీ పార్టీ యూనిట్లు శాంతిని నెలకొల్పడం, సాయుధ పోరాటాన్ని విరమించడం అనే విషయంలో సానుకూల వైఖరిని కలిగి వున్నాయని, ఈ సందర్భంగా సికాస  సిబిఎం సోను శాంతి ప్రతిపాదనలను సమర్ధిస్తున్నదని అశోక్ పేర్కొన్నారు.
పార్టీ యొక్క ఆచరణ పై సుదీర్ఘ కాలం నుండి తెలంగాణ ప్రజలు లోతైన అవగాహన కలిగి వున్నారని,తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. అభ్యుదయ భావాలను ఎల్లప్పుడూ ఆదరిస్తారన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యం కారణంగానే సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామిక ఉద్యమాలు కొనసాగుతున్నాయని, పార్టీనీ, క్యాడర్లనూ రక్షించుకోవడం కోసం సాయుధ పోరాటం వదిలి చట్టబద్ధ పోరాటాలలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అర్ధం చేసుకోవాలని కోరారు. ఈ శాంతి ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి శాంతి ప్రక్రియనూ, సాయుధ పోరాట విరమణను ఆమోదించిన వారు సికాసను సంప్రదించాలని కోరారు.
మారిన మెజారిటీ పార్టీ వైఖరిని గమనంలో వుంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం కొరకు  పార్టీతో శాంతి చర్చలు జరపడానికి చొరవ చేయాలని కోరారు. ఇందు కొరకు సానుకూల వాతావరణం ఏర్పర్చాలని కోరారు. ప్రభుత్వం తమవైపు ప్రతినిధి వర్గాన్ని ప్రకటిస్తే మా పార్టీ వైపు నుండి త్వరలోనే ప్రతినిధులను ఏర్పాటు చేసి ఆయుధాలను త్యజించి, శాంతియుతంగా చట్ట పరిధిలోకి పార్టీని తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.IMG-20251008-WA0056

Tags: