పాత కక్ష్యలతోనే కాంగ్రెస్ నేత గంగరెడ్డి హత్య
పాతకక్ష్యలలోనే కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య
నిందితున్ని అరెస్టు చేసిన జగిత్యాల పోలీసులు
వివరాలు తెలిపిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 25: పాతకక్ష్యల నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య జరిగిందని, నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గంగారెడ్డి హత్య పాతకక్ష నేపథ్యంలోనే జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, గంగారెడ్డిని ఈ నెల 22న గ్రామంలో బైక్ వెళ్తుండగా వెనుక నుండి కారులో వచ్చి ఢీకొట్టి గంగారెడ్డి కిందపడగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేయగా గంగారెడ్డి
ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. గ్రామంలో సాక్ష్యులను విచారించి, సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా, గ్రామంలోని సిసి కెమెరాల్లో నిందితుడు బత్తిని సంతోష్ హత్య చేసిన అనంతరం పారిపోతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిందితుడు బత్తిని సంతోష్, అతని తండ్రి లచ్చన్నకు సంతోష్ మామకు గత 15 ఏళ్లుగా భూవివాదం ఉందని, ఆ వివాదంలో గంగారెడ్డి సంతోష్ మామకు మద్దతుగా నిలిచాడని, దీంతో నిందితుడైన సంతోష్ మృతుడు గంగారెడ్డి కక్ష పెంచుకున్నారు. 2020 ఏడాదిలో సంతోష్పై ఓ
వివాదంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైందని, ఈ కేసు మృతుడు గంగారెడ్డి ప్రోద్బలంతోనే నమోదైనట్లు నిందితుడు సంతోష్ మృతుడు గంగారెడ్డిపై అనుమానం పెంచుకున్నాడు. హత్య ఘటనకు 15 రోజుల ముందు సంతోష్ ఎస్సీ, ఎస్టీ కేసు రాజీ కోసం గంగారెడ్డిని సంప్రదించగా, గంగారెడ్డి ఈ సందర్భంగా సంతోష్ ను దుర్భాష లాడినట్లు విచారణలో
తెలిసింది. దీంతో గంగారెడ్డిని హత్య చేయాలని సంతోష్ నిర్ణయించుకొని అక్టోబర్ 22న అద్దె కారులో ఒకత్తిని వెంట ఉంచుకొని గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గంగారెడ్డిని వెనుక నుండి కారుతో ఢీకొట్టాడు. కింద పడిన గంగారెడ్డి లేవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో నిందుతుడు సంతోష్ కారులో నుండి కత్తిని తీసి గంగారెడ్డిపై అనేక సార్లు
విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. కొంతమంది గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోగా వారిని చూసిన సంతోష్ తన సెల్ఫోన్, కారును ఘటన స్థలంలోనే విడిచి పారిపోతుండగా గ్రామంలోని రహదారి వద్ద గల సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. పోలీసులు నిందితుడు బత్తిని సంతోష్ ను పట్టుకొని శుక్రవారం కోర్టులో హజరుపర్చినట్లు ఎస్పీ ప్రకటనలో తెలిపారు. గంగారెడ్డి హత్యలో ఇతర వ్యక్తులు ప్రమేయం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.